విధాత, హైదరాబాద్ : చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద రోగుల పట్ల వైద్య సిబ్బంది సేవాభావంతో పనిచేసి, మర్యాదగా ప్రవర్తించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. ఆదివారం ఖమ్మం జిల్లా ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ప్రాంగణంలో చెత్తాచెదారం, మురుగు పేరుకుపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పరిసరాలను శుభ్రపరచాలని వైద్యాధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో పడకల సంఖ్య 450నుంచి 600వరకు పెంచుతామని.. వైద్యులు, సిబ్బంది ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. ఆయా అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ను ఆదేశించారు. మంత్రి వెంట నగరపాలక కమిషనర్ అభిషేక్ అగస్త్య. ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ బి.కిరణ్ కుమార్లు ఉన్నారు.
Tummala Nageswara Rao | వైద్య సిబ్బంది సేవాభావంతో పనిచేయాలి : మంత్రి తుమ్మల
చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద రోగుల పట్ల వైద్య సిబ్బంది సేవాభావంతో పనిచేసి, మర్యాదగా ప్రవర్తించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు.

Latest News
Avore Electric | చైనా విడిభాగాలు వాడకుండా.. పూర్తి స్వదేశీ టెక్నాలజీతోనే ఎలక్ట్రిక్ బైక్!
Realme P4R | 8000mAh భారీ బ్యాటరీతో రియల్మీ సరికొత్త ఫోన్.. ఒక్కసారి చార్జ్ చేస్తే21.5 గంటలు నాన్స్టాప్ యూట్యూబ్ వీడియోలు చూడొచ్చు!!
Madhu Yaskhi | అమెరికాలో కారు ప్రమాదం.. మధుయాష్కీ గౌడ్ సతీమణి డాక్టర్ సుచికి తీవ్ర గాయాలు
లొంగిపోయిన మావోయిస్టుల పయనమెటు!?
పవన్ కళ్యాణ్ పై గద్దర్ కూతురు వెన్నెల ఫైర్.!
పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరణ సరికాదు: చంద్రబాబు
తెలంగాణ భూమి పుత్రులే పోటీ చేస్తామంటే అభ్యంతరం ఎందుకు? : పవన్ కల్యాణ్
భుజంగరావును అరెస్టు చేసిన ఏసీబీ..రూ.5.92కోట్ల ఆస్తుల గుర్తింపు
తెలంగాణలో ఎల్లుండి నుంచి భూముల విలువ పెంపు : మంత్రి పొంగులేటి
సోలార్ ప్యానెల్ వ్యర్థాలతో ఢిల్లీకి కొత్త ముప్పు.. గ్రీన్ ఎనర్జీ వెనుక కాలుష్య సంక్షోభం