విధాత, హైదరాబాద్ : చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద రోగుల పట్ల వైద్య సిబ్బంది సేవాభావంతో పనిచేసి, మర్యాదగా ప్రవర్తించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. ఆదివారం ఖమ్మం జిల్లా ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ప్రాంగణంలో చెత్తాచెదారం, మురుగు పేరుకుపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పరిసరాలను శుభ్రపరచాలని వైద్యాధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో పడకల సంఖ్య 450నుంచి 600వరకు పెంచుతామని.. వైద్యులు, సిబ్బంది ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. ఆయా అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ను ఆదేశించారు. మంత్రి వెంట నగరపాలక కమిషనర్ అభిషేక్ అగస్త్య. ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ బి.కిరణ్ కుమార్లు ఉన్నారు.
Tummala Nageswara Rao | వైద్య సిబ్బంది సేవాభావంతో పనిచేయాలి : మంత్రి తుమ్మల
చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద రోగుల పట్ల వైద్య సిబ్బంది సేవాభావంతో పనిచేసి, మర్యాదగా ప్రవర్తించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు.

Latest News
ఆ ఆరు హత్యలు ఎందుకు చేశానంటే.. షాబాద్ కిరాతకుడి సెల్ఫీ వీడియో
CPS నుంచి OPSకు మారేందుకు ఏపీ ప్రభుత్వ నిర్ణయం.. తెలంగాణలోనూ అవకాశం కల్పించాలి
మాఝీ లడ్కీ బహిన్ యోజనలో 92 లక్షల మంది మరాఠా మహిళల పేర్ల తొలగింపు
తెలంగాణకు ఐఐఎం సాధించుకోవాలి
ఉద్యమకారుల శాశ్వత రక్షణకు కమిషన్
ప్రవహిస్తున్న నీటి నుంచే లిఫ్ట్ చేసుకునే వీలుంటే బ్యారేజీలు ఎందుకు కట్టారు?
తెలంగాణ కాంగ్రెస్ లో మండల కమిటీల చిచ్చు..!
కొమ్ములతో సందర్శకుడిని గాల్లో ఎగరేసిన బైసన్ దున్న
నీళ్లు అడిగితే…సైకో మాటలు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
బడికి వెళ్లాలంటే తాళ్ల వంతెన ట్రాలీ సాహసయాత్ర చేయాల్సిందే..!