విధాత, హైదరాబాద్ : నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తాను ఎమ్మెల్యేనన్న ఆలోచనను పక్కన పెట్టి తన వ్యవసాయ పొలంలో సాధారణ రైతుగా పొలం పనుల్లో పాల్గొన్నారు. కూలీలతో కలిసి పొలంలో అడుగుమందు చల్లారు. అనంతరం మహిళా కూలీలకు నాట్లు వేసేందుకు అవసరమైన నారు అందచేశారు. ఎమ్మెల్యే తమతో కలిసి పనిచేయడం చూసిన కూలీలు ఆయన వ్యవహారశైలిని అభినందించారు. ఎమ్మెల్యే వీరేశం అధికార దర్పానికి దూరంగా సాధారణ రైతు మాదిరిగా పొలంలో పనిచేయడంతో పాటు నియోజవర్గం ప్రజలను నిత్యం కలుస్తు, వారి మంచిచెడుల కార్యక్రమాలకు హాజరవుతు అందుబాటులో ఉంటుండటం పట్ల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నకిరేకల్(ఎస్సీ) నియోజకవర్గం నుంచి 2014ఎన్నికల్లో బీఆరెస్ నుంచి గెలిచిన వీరేశం 2018ఎన్నికల్లో ఓడిపోయారు. తిరిగి 2023ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
మందు చల్లి…నారు వేసి పొలం పనుల్లో : ఎమ్మెల్యే వీరేశం
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తాను ఎమ్మెల్యేనన్న ఆలోచనను పక్కన పెట్టి తన వ్యవసాయ పొలంలో సాధారణ రైతుగా పొలం పనుల్లో పాల్గొన్నారు. కూలీలతో కలిసి పొలంలో అడుగుమందు చల్లారు

Latest News
మే 1 నుంచి తెలంగాణ ప్రభుత్వోద్యోగుల బదిలీలు
వన్ప్లస్ నార్డ్ CE 6 లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయంటే..!
ఇంకో 6 రోజుల్లో 'పెద్ది' షూటింగ్ పూర్తి : జూన్లో విడుదల
మూడేళ్ల అనుభవంతో రూ.9కోట్ల ప్యాకేజీ.. రిమోట్ జాబ్ ఆఫర్పై యువతి పోస్టు వైరల్
పాములతో ఫ్యామిలీ బిజినెస్.. కోట్లు సంపాదిస్తున్న చైనా యువతి!
రైతు భరోసాపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం.. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం
హాష్ అయిల్ అంతర్ రాష్ట్ర స్మగ్లింగ్ ముఠా అరెస్టు.. రెండున్నర కోట్ల విలువైన ఆయిల్ స్వాధీనం
కేసీఆర్ తెలంగాణ ‘సెంటిమంట’ పండేనా! ఆ మూడు అంశాలపై మౌనమెందుకు?
సాఫ్ట్వేర్ జాబ్ పోవడంతో.. ఇంటిపై గంజాయి సాగు చేస్తున్న హైదరాబాద్ టెక్కీ
కుసుమంచిలో సర్వే మ్యాప్తో తొలి రిజిస్ట్రేషన్.. భూ రిజిస్ట్రేషన్లలో నూతన శకం