Site icon vidhaatha

తెలంగాణ గ్రూప్​–1 మెయిన్స్​ పరీక్షలు యధాతథం : కేసులు కొట్టేసిన హైకోర్టు

Group-1 | హైద‌రాబాద్ : టీజీపీఎస్సీ( TGPSC ) ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న గ్రూప్-1( Group-1 ) నియామ‌క ప్ర‌క్రియ‌పై హైకోర్టు( Highcourt )లో తుది తీర్పు వెలువరించింది. పరీక్షలు యధావిధిగా జరుగుతాయని వెల్లడించింది.

కీ, రీ నోటిఫికేష‌న్, ఎస్టీ రిజ‌ర్వేష‌న్ ప్ర‌కారం మెరిట్ జాబితాను మ‌ళ్లీ విడుద‌ల చేయాల‌ని ప‌లువురు అభ్య‌ర్థులు హైకోర్టులో పిటిష‌న్లు దాఖ‌లు చేశారు. ప్రిలిమ్స్‌లోని 7 ప్రశ్నలకు తుది ‘కీ’లో సరైన జవాబులు ఇవ్వలేదని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. వాటికి మార్కులు కలిపి మళ్లీ జాబితా ఇవ్వాలని కోరారు. ఈ పిటిష‌న్ల‌పై కోర్టు విచార‌ణ పూర్తి చేసింది. అన్ని అభ్యంత‌రాల‌ను ప‌రిశీలించాకే తుది కీని విడుద‌ల చేశామ‌ని టీజీపీఎస్సీ కోర్టుకు తెలిపింది. ఈ నెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ ప‌రీక్ష‌లు ఉండ‌డంతో ఈ కేసు విచార‌ణ‌కు హైకోర్టు ప్రాధాన్య‌త ఇచ్చింది.

తీర్పుపై అభ్య‌ర్థుల్లో ఉత్కంఠ నెలకొన్న దృష్ట్యా నేడు ఉన్నత న్యాయస్థానం తన తీర్పును విడుదల చేసింది. పరీక్షలను యథాతధంగా నిర్వహించేందుకు టిజిపిఎస్​సీకి అనుమతిని మంజూరు చేస్తూ, వివిద వర్గాలు దాఖలు చేసిన అన్ని కేసులను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.

Exit mobile version