Hyderabad Bullet Train Hub | బుల్లెట్‌ ట్రెయిన్‌ హబ్‌గా హైదరాబాద్‌ : చెన్నై, బెంగళూరు, ముంబైకి హైస్పీడ్‌ రైళ్లు

హైదరాబాద్‌ను దేశంలోని ప్రధాన బుల్లెట్‌ ట్రెయిన్‌ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై, బెంగళూరు, ముంబైతో హైస్పీడ్‌ రైలు మార్గాలు ఏర్పడనుండటంతో ప్రయాణ సమయం 2–3 గంటలకు తగ్గనుంది. శంషాబాద్ కేంద్రంగా బుల్లెట్​ రైళ్ల కేంద్రం అభివృద్ధితో రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ ఆకాశానికి చేరే అవకాశముంది.

Hyderabad bullet train hub with high-speed trains passing near Charminar and elevated rail tracks at sunset

Hyderabad to Become India’s Bullet Train Hub | High-Speed Rail to Chennai, Bengaluru, Mumbai

విధాత భారత్​ డెస్క్​ | హైదరాబాద్​:

Hyderabad Bullet Train Hub | దేశంలోనే అత్యంత కీలకమైన బుల్లెట్‌ ట్రెయిన్‌ కేంద్రంగా హైదరాబాద్‌ రూపుదిద్దుకోనుంది. కేంద్ర బడ్జెట్‌–2026లో ప్రకటించిన హైస్పీడ్‌ రైలు కారిడార్లతో చెన్నై, బెంగళూరు, ముంబై (పుణె మార్గంలో) నగరాలకు అతి వేగ రైలు సేవలు అందుబాటులోకి రానుండటంతో ఈ హబ్​ తెలంగాణ రాజధాని దేశ రవాణా రంగంలో ముఖ్యమైన స్థానం సంపాదించనుంది.

శంషాబాద్‌ను ప్రధాన టెర్మినల్‌గా అభివృద్ధి చేస్తూ మూడు దిశల హైస్పీడ్‌ కారిడార్లను నిర్మించనున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయంతో ప్రాచుర్యం పొందిన శంషాబాద్, ఇక బుల్లెట్‌ ట్రెయిన్‌ కేంద్రంగా మారనుంది.

 ప్రయాణ సమయాల్లో విప్లవాత్మక మార్పు

ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి చెన్నై, బెంగళూరు, పుణె, ముంబై వంటి నగరాలకు రైలు ప్రయాణం 12 నుంచి 15 గంటల వరకు పడుతోంది. బుల్లెట్‌ ట్రెయిన్‌ ప్రాజెక్టులు అమల్లోకి వస్తే ఈ సమయం గణనీయంగా తగ్గనుంది.

ప్రతిపాదిత ప్రయాణ సమయాలు:

బుల్లెట్​ రైళ్లు గరిష్టంగా 350 కి.మీ వేగంతో రైళ్లు నడవనున్నాయి. సగటు వేగం 200–250 కి.మీ వరకు ఉండనుంది. ఇది విమాన ప్రయాణానికి ప్రత్యామ్నాయంగా మారడమే కాక, ధరలు కూడా అందుబాటులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

శంషాబాద్ కేంద్రంగా హైస్పీడ్‌ ట్రయాంగిల్​

హైదరాబాద్‌–బెంగళూరు–చెన్నై మార్గాలు కలిసి ‘హైస్పీడ్‌ ట్రయాంగిల్‌’గా అభివృద్ధి కానున్నాయి. ఈ నెట్‌వర్క్‌ ద్వారా ఐటీ, పరిశ్రమలు, విద్య, వైద్య రంగాలకు మరింత ఊతం లభించనుంది.

ప్రధానంగా ఈ మార్గాలు గుండా వెళ్లే పట్టణాలు:

చిన్న పట్టణాలకు కూడా హైస్పీడ్‌ కనెక్టివిటీ అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

పూర్తిగా కొత్త రైల్వే లైన్లు

ఈ బుల్లెట్‌ రైలు మార్గాలు పూర్తిగా గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టులుగా నిర్మించనున్నారు. అంటే, ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్‌లకు సంబంధం లేకుండా ప్రత్యేకంగా వీటిని అభివృద్ధి చేస్తారు.

ముఖ్య లక్షణాలు:

భూసేకరణ సమస్యలు తగ్గించేందుకే ఎలివేటెడ్‌ మార్గాలను ఎంచుకున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

భారీ పెట్టుబడులు – నిధుల సవాళ్లు

తెలంగాణలో ప్రస్తుతం రూ.47,984 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. 2026–27 బడ్జెట్‌లో రాష్ట్రానికి రూ.5,454 కోట్ల కేటాయింపు లభించింది.

అయితే బుల్లెట్‌ ట్రెయిన్‌ ప్రాజెక్టులకు నిధుల సమీకరణ ప్రధాన సవాలుగా మారనుంది. ముంబై–అహ్మదాబాద్‌ మోడల్‌ బులెట్​ రైలు ప్రయాణం అమలైతే రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు భరించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం:

భూసేకరణ, వ్యయభారం కారణంగా ప్రాజెక్టులు పూర్తవ్వడానికి కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది.

రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ అంచనాలు

బుల్లెట్‌ ట్రెయిన్‌ హబ్‌గా మారనున్న శంషాబాద్‌ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్​లో రెసిడెన్షియల్‌ ప్రాజెక్టులు, ఐటీ పార్కులు, లాజిస్టిక్స్‌ హబ్‌లు కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు వేగంగా విస్తరిస్తున్నాయి. హైస్పీడ్‌ కనెక్టివిటీతో పెట్టుబడులు మరింత పెరుగనున్నాయి.

ఉపాధి అవకాశాలు, ఆర్థిక వృద్ధి

ఈ ప్రాజెక్టులతో వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా. నిర్మాణం, నిర్వహణ, టెక్నాలజీ, సేవల రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పరిశ్రమలకు వేగవంతమైన రవాణా, పర్యాటక రంగానికి ఊతం, విద్య, వైద్య సేవలకు మెరుగైన చేరువ, వ్యాపార విస్తరణ వంటి లాభాలు అందుతాయి. దీంతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక ప్రయోజనం కలగనుంది.

దేశంలోనే అత్యంత కీలక బుల్లెట్‌ ట్రెయిన్‌ హబ్‌గా హైదరాబాద్‌ ఎదగడానికి కేంద్ర ప్రభుత్వం బలమైన పునాది వేసింది. శంషాబాద్‌ కేంద్రంగా ఏర్పడనున్న హైస్పీడ్‌ కారిడార్లు తెలంగాణ అభివృద్ధికి కొత్త దిశ చూపనున్నాయి. నిధుల సవాళ్లు ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్టులు అమలైతే రాష్ట్ర రవాణా చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించబడనుంది.

Latest News