విధాత, హైదరాబాద్ 😐 జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్కు వరద ప్రవాహం పోటెత్తుతోంది. ఎగువన ఉన్న మహారాష్ట్రలోని ప్రాణహిత, తెలంగాణలోని గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆదివారం బరాజ్ ఇన్ఫ్లో 4,87,010 క్యూసెక్కులకు పెరిగింది. మొత్తం 85 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా అన్నారం బరాజ్కు 16,870 క్యూసెక్కుల నీరు వస్తుండగా, మొత్తం 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం సమ్మక్క బరాజ్ వద్ద ఎగువనుంచి 8 లక్షల 8 వేల 340 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. దీంతో బరాజ్ వద్ద గోదావరి నీటిమట్టం 82 మీటర్ల ఎత్తుకు చేరుకుంది. మొత్తం 59 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
Jayashankar Bhupalapalli | మేడిగడ్డ వద్ద జోరు తగ్గని గోదావరి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్కు వరద ప్రవాహం పోటెత్తుతోంది.

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు