విధాత, హైదరాబాద్ 😐 జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్కు వరద ప్రవాహం పోటెత్తుతోంది. ఎగువన ఉన్న మహారాష్ట్రలోని ప్రాణహిత, తెలంగాణలోని గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆదివారం బరాజ్ ఇన్ఫ్లో 4,87,010 క్యూసెక్కులకు పెరిగింది. మొత్తం 85 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా అన్నారం బరాజ్కు 16,870 క్యూసెక్కుల నీరు వస్తుండగా, మొత్తం 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం సమ్మక్క బరాజ్ వద్ద ఎగువనుంచి 8 లక్షల 8 వేల 340 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. దీంతో బరాజ్ వద్ద గోదావరి నీటిమట్టం 82 మీటర్ల ఎత్తుకు చేరుకుంది. మొత్తం 59 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
Jayashankar Bhupalapalli | మేడిగడ్డ వద్ద జోరు తగ్గని గోదావరి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్కు వరద ప్రవాహం పోటెత్తుతోంది.

Latest News
గుడ్ న్యూస్..హైదరాబాద్లో ఎంఎంటీఎస్లో ఫ్రీ జర్నీ!
ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ట్రెండ్ ..
అక్షయ తృతీయ బంగారం సేల్స్ పెరిగేనా..?
రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న దీపికా పదుకొనే- రణవీర్ సింగ్ జంట
మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. రోజుకు 338 పదాలను తగ్గించేశాం.. ఆందోళన రేకెత్తిస్తున్న అధ్యయనం!
ప్రభుత్వ మీటింగ్ మధ్యలో అనుకోని అతిథి.. కలెక్టర్ కుర్చీలో కూర్చొని కోతి హంగామా!
రాశీ ఖన్నా కారవాన్లో చోరీ
పవన్ కళ్యాణ్ ఆరోగ్యానికి ఏమైంది..
నెలకు రూ.3లక్షల జీతంతో జర్మనీలో ఉద్యోగాలు.. టామ్కామ్ ద్వారా భర్తీ
ట్రక్కు డ్రైవింగ్ వస్తే.. జర్మనీలో 3.7 లక్షల జీతం.. టామ్కామ్ ద్వారా నోటిఫికేషన్ విడుదల.. రేపే ఇంటర్వ్యూలు!