విధాత : ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ ఇంచార్జీగా నెమలికొండ వేణుమాధవ్ నియమితులయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఈ నియామకాన్ని వెల్లడించారు. సంగారెడ్డి నియోజకవర్గం సదాశివపేటకు చెందిన నెమలికొండ వేణుమాధవ్ గతంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జీగా, బండి సంజయ్ నిర్వహించిన ప్రజాసంగ్రామ యాత్రలో రాష్ట్ర మీడియా కమిటీ సభ్యునిగా, పలు ఉప ఎన్నికల్లో ఇంచార్జీగా పని చేశారు. ఆర్ఎస్ఎస్ కుటుంబ నేపధ్యం ఉన్న వేణుమాధవ్ ఏబీవీపీలో, హిందు వాహినిలో పలు బాధ్యతలు నిర్వర్తించారు. మెదక్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. 10 సంవత్సరాలకు పైగా జర్నలిస్టుగా పనిచేశారు. ఉన్నత విద్యావంతునిగా, క్రియాశీల కార్యకర్తగా వేణుమాధవ్ పేరు తెచ్చుకున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గ ప్రభారీ గా తనను నియామకం చేసినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ నాయకులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే. లక్ష్మణ్, ఇతర రాష్ట్ర నాయకులకు వేణుమాధవ్ ధన్యవాదాలు తెలిపారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానన్నారు.
ముషీరాబాద్ బీజేపీ ఇంచార్జీగా వేణుమాధవ్
ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ ఇంచార్జీగా నెమలికొండ వేణుమాధవ్ నియమితులయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఈ నియామకాన్ని వెల్లడించారు
Latest News

మెనోపాజ్, ప్రిమెనోపాజ్.. వైద్యుల సహాయం ఏ సమయంలో అవసరం?
చందమామపై నగరం నిర్మిస్తే ఇలా ఉంటుంది.. వీడియో
వాట్సాప్ కొత్త ఫీచర్.. ఇక వెబ్ నుంచి కూడా కాల్స్ మాట్లాడుకోవచ్చు
లంచం సొమ్ముతో ఏసీబీకి చిక్కిన మాదాపూర్ ఎస్ఐ
ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం..రూ.1511 కోట్ల భూముల పరిరక్షణ
శ్రీశైలంలో శివ భక్తుల గోస..గ్రామోత్సవం రద్దు!
వెడ్డింగ్ యానివర్సరీ..
పాన్ ఇండియా స్టార్గా అల్లు అర్జున్…
ఢిల్లీలో చంద్రబాబు బిజీ బిజీ..విశాఖ మెట్రో ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం
ఇప్పటికీ కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ : మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు