Site icon vidhaatha

ఏపీ శాసన సభ రద్దు .. గవర్నర్ నజీర్ నోటిఫికేషన్‌

విధాత : ఆంధ్రప్రదేశ్ 15వ శాసన సభను రద్దు చేస్తూ గవర్నర్ అబ్ధుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు.ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో 16వ శాసన సభ ఏర్పాటుకు వీలుగా 15వ శాసన సభను రద్దు చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీ 11సీట్లకు మాత్రమే పరిమితమై ఘోర ఓటమి పొంది కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. ఈ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 175సీట్లకు 164సీట్లు గెలుచుకుంది. ఈ నెల 9న కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు పదవి ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం.

Exit mobile version