విధాత, హైదరాబాద్ : తిరుమల రెండు ఘాట్ రోడ్డులలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై టీటీడీ ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. టీటీడీ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రకారం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వన్యప్రాణుల సంతానోత్పత్తి కాలం ఎక్కువగా ఉంటుందని, దీంతో క్రూర మృగాలు మొదటి ఘాట్ రోడ్డులో తరచూ రోడ్లు దాటుతూ ఉంటాయని, భక్తుల భద్రత దృష్ట్యా రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించినట్లుగా టీటీడీ పేర్కోంది. ఆగస్టు 12 సోమవారం నుంచి సెప్టెంబర్ 30వ తేదీవరకు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను అనుమతించనున్నట్లుగా తెలిపింది. భక్తులతో పాటు వన్యప్రాణుల ప్రయోజనాల దృష్ట్యా మానవ-జంతు సంఘర్షణను నివారించడానికి ఈ ఆంక్షలు అమలు చేస్తున్నామని భక్తులు ఈ మార్పును గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు.
TTD | తిరుమలలో ద్విచక్ర వాహనాలపై ఆంక్షలు.. ఉదయం 6 నుంచి రాత్రి 9గంటల వరకు అనుమతి
తిరుమల రెండు ఘాట్ రోడ్డులలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై టీటీడీ ఆంక్షలు అమల్లోకి తెచ్చింది

Latest News
ఎస్బీఐ పీవో నెల జీతం రూ.1.25 లక్షలు.. సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ
వైట్ డ్రెస్ లో క్యూట్ లుక్ లో మెస్మరైజ్ చేస్తున్న స్పిరిట్ భామ త్రిప్తి
ప్రభాస్ ఎదుగుదలపై భారీ కుట్ర పన్నారా ..
ఘోర విమాన ప్రమాదం.. 15 మంది దుర్మరణం
తిరుమల లడ్డులో కెమికల్స్ వాడారు: టీడీపీ వీడియో వైరల్
బంగారం, వెండి ధరల ఆల్ టైమ్ రికార్డు..ఒకే రోజు భారీగా పెంపు
ఓటీటీలోకి వచ్చేసిన రోషన్ మేకా ‘ఛాంపియన్’ ..
లేచిపోయి పెళ్లి చేసుకోవాలని అనుకున్నా..
రెండు వేళ ఏళ్ల క్రితమే బ్యాటరీ? మళ్లీ హాట్ టాపిక్గా ‘బాగ్దాద్’ బ్యాటరీ..
ఉదయం 11 గంటలకు అజిత్ పవార్ అంత్యక్రియలు