విధాత, హైదరాబాద్ : తిరుమల రెండు ఘాట్ రోడ్డులలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై టీటీడీ ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. టీటీడీ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రకారం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వన్యప్రాణుల సంతానోత్పత్తి కాలం ఎక్కువగా ఉంటుందని, దీంతో క్రూర మృగాలు మొదటి ఘాట్ రోడ్డులో తరచూ రోడ్లు దాటుతూ ఉంటాయని, భక్తుల భద్రత దృష్ట్యా రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించినట్లుగా టీటీడీ పేర్కోంది. ఆగస్టు 12 సోమవారం నుంచి సెప్టెంబర్ 30వ తేదీవరకు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను అనుమతించనున్నట్లుగా తెలిపింది. భక్తులతో పాటు వన్యప్రాణుల ప్రయోజనాల దృష్ట్యా మానవ-జంతు సంఘర్షణను నివారించడానికి ఈ ఆంక్షలు అమలు చేస్తున్నామని భక్తులు ఈ మార్పును గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు.
TTD | తిరుమలలో ద్విచక్ర వాహనాలపై ఆంక్షలు.. ఉదయం 6 నుంచి రాత్రి 9గంటల వరకు అనుమతి
తిరుమల రెండు ఘాట్ రోడ్డులలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై టీటీడీ ఆంక్షలు అమల్లోకి తెచ్చింది

Latest News
వేసవి కాలంలో వీధికుక్కలు ఎందుకు ఎక్కువగా కరుస్తాయి? వెటర్నరీ డాక్టర్లు ఏం చెబుతున్నారు?
కార్పొరేట్ జాబ్ వదిలి ఆటో డ్రైవర్గా మారిన బెంగళూరు టెకీ..!
ఐపీఎల్ పేరుతో మెసేజ్లు.. నమ్మితే నాశనమే : పోలీసుల హెచ్చరిక
కారుబాంబు దాడి ... తృటిలో తప్పించుకున్న మోహన్ బాబు
‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసులో డేవిడ్ వార్నర్ అరెస్టు
మేం అంతా ప్రాణ త్యాగానికి సిద్దం : ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్
కేరళం ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమికే మా మద్దతు : కవిత
రేవంత్ పాలన అంటేనే రాక్షస పాలన: హరీశ్ రావు ఫైర్
కేరళంలో వచ్చేది యూడీఎఫ్ ప్రభుత్వమే : సీఎం రేవంత్ రెడ్డి
'చిరాన్ ఫోర్ట్ క్లబ్' భవన నిర్మాణాల కూల్చివేత ఆపాలి