Site icon vidhaatha

వెనెగోడు పేరు మార్చాలని కేంద్రాన్ని కోరిన ఏపీ ప్రభుత్వం

విధాత:అమరావతి: విభజన చట్టం 11వ షెడ్యూల్‌లో వెనెగోడు పేరు మార్చాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ లేఖ రాశారు. వెనెగోడు పేరును పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుగా మార్చాలని లేఖలో కోరారు. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తెస్తూ గెజిట్ జారీ చేసిన దృష్ట్యా అత్యవసరంగా ఈ పేరు మార్చాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సవరణ నోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్ర హోంశాఖను సీఎస్‌ కోరారు.

Exit mobile version