యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో సీతయ్య(42) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఆరితోటి సీతయ్య, పాలూరు కొండయ్యలు ఇద్దరు స్నేహితులు వంగపల్లిలో మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం రాత్రి ఇద్దరూ కలిసి మద్యం సేవించేక్రమంలో కొండయ్య తన మొబైల్ ఫోన్ రిపేర్ కోసం సీతయ్యను రూ.3 వేలు అడగగా సీతయ్య ఇవ్వకపోవడంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. అనంతరం ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. సీతయ్య తన ఇంటి ఆరుబయట నిద్రిస్తుండగా.. గొడవను మనసులో పెట్టుకున్న కొండయ్య ఒక ఇనుప రాడ్ తో వెళ్లి నిద్రిస్తున్న సీతయ్య తలపైన బలంగా కొట్టాడు. దీంతో సీతయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న యాదగిరిగుట్ట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు కొండయ్య పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
సెల్ఫోన్ రిపేర్ కి డబ్బు ఇవ్వలేదని .. వ్యక్తి హత్య..!
<p>యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో సీతయ్య(42) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఆరితోటి సీతయ్య, పాలూరు కొండయ్యలు ఇద్దరు స్నేహితులు వంగపల్లిలో మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం రాత్రి ఇద్దరూ కలిసి మద్యం సేవించేక్రమంలో కొండయ్య తన మొబైల్ ఫోన్ రిపేర్ కోసం సీతయ్యను రూ.3 వేలు అడగగా సీతయ్య ఇవ్వకపోవడంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. అనంతరం ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. […]</p>
Latest News

Free Bus | ఫ్రీ బస్సును ఇలా కూడా వాడేస్తున్నారా.. బస్సులోనే బ్రష్ చేసిన మహిళ.. వీడియో వైరల్
Social Media Ban | 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్మీడియాపై నిషేధం.. నిజంగా బ్యాన్ సాధ్యమవుతుందా? ఈ సవాళ్లను ఎలా అధిగమిస్తారు?
Realme | రేపే మార్కెట్లోకి కొత్త 5జీ స్మార్ట్ఫోన్.. చీప్ అండ్ బెస్ట్ మొబైల్ కొనాలని చూసేవాళ్లకు బెస్ట్ ఆప్షన్!
ప్రాంతీయ పార్టీలకు మోదీ గండం.. బీహార్లో నితీశ్ పార్టీకి ముగింపేనా!
సెలబ్రిటీ పెళ్లిళ్ల సందడి..
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్లో డాక్టర్ గురవా రెడ్డి పోస్ట్ వైరల్..
మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై సరికొత్త చర్చ..
నాలుగు రోజుల్లో అమెరికా కోల్పోయిన మిలిటరీ ఎక్విప్మెంట్ విలువ తెలుసా!
వృషకర్మ’ గ్లింప్స్ ఈవెంట్లో ప్రమాదం..
విజయ్-త్రిష ఒకే కారులో..