Site icon vidhaatha

వేస‌వి ఔష‌ధం… మ‌జ్జిగ‌

ఒక్కో ఏడాది గ‌డుస్తున్న కొద్దీ ఎండ‌లు పెరిగిపోతున్నాయి. అందుకే మార్చిలోనే ప‌గ‌టి స‌మ‌యం బ‌య‌టికి వెళ్లాలంటేనే భ‌యం వేసే వాతావ‌ర‌ణ ప‌రిస్థితులున్నాయి. ఎండ‌ల్లో బ‌య‌టికి వెళ్లిన‌ప్పుడ‌ల్లా కూల్ డ్రింకులు తాగ‌డం చాలా మందికి అల‌వాటు. కానీ ఇలాంటి ఏరేటెడ్ డ్రింక్స్ క‌న్నా కొబ్బ‌రి బోండాలు, మ‌జ్జిగ లాంటివే ఎక్కువ మేలు చేస్తాయ‌ని చెబుతూ ఉంటారు వైద్య నిపుణులు. 


మ‌జ్జిగ తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ల్ల‌ద‌న‌మే కాకుండా.. పొట్ట‌లోని మంచి బాక్టీరియా పెరుగుతాయి. అందుకే వేస‌విలో అన్ని ర‌కాలుగా కూడా మ‌జ్జిగ తాగ‌డం ఎక్కువ మేలు చేస్తుంది.

Exit mobile version