విధాత: అనుకున్నంత అయింది. అందరినీ బయపెడుతున్న, అందరూ బయపడుతున్న కరోనా ఓమిక్రాన్ వేరియంట్ రానే వచ్చింది. నేడు (గురువారం) హైదరాబాద్లో తొలి కేసు నమోదైంది. బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జినోమ్ సీక్వెన్స్ కోసం పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ స్పస్టం చేశారు
ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని కోరారు. కాగా ఈరోజు నుంచి రాష్ట్రంలో మాస్క్ తప్పనిసరి చేశారు. మాస్క్ ధరించకపోతే వెయ్యి రూపాయల ఫైన్ విధించనున్నట్లు అధికారులు తెలిపారు.