లూవ్ మ్యూజియంలో దొంగతనం కలకలం – ఫ్రెంచ్ రాజుల ఆభరణాలు నాలుగు నిమిషాల్లో మాయం
పారిస్ : ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లూవ్ మ్యూజియం ఆదివారం ఉదయం అద్భుత దొంగతనానికి వేదికైంది. ఫ్రెంచ్ రాజ్యానికి చెందిన విలువైన ఆభరణాలను దొంగలు కేవలం నాలుగు నిమిషాల్లోనే దొంగిలించి పారిపోయారు. ఈ ఘటన ఫ్రాన్స్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

“మేము సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్నాం, కానీ అప్పటికి దొంగలు మాయం అయ్యారు. ఇది చాలా ప్రొఫెషనల్గా జరిగిన దొంగతనం.”
— రషీదా దాతీ, ఫ్రెంచ్ సంస్కృతి మంత్రి
దుర్ఘటన జరిగిన వెంటనే మ్యూజియం మూసేసి, ప్రజలను బయటకు తరలించగా, ఆ ప్రాంతం మొత్తాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఆపరేషన్ అనంతరం ఆ రోజు మొత్తం మ్యూజియం తలుపులు మూసే ఉంచేలా నిర్ణయించారని అధికారులు తెలిపారు.
నెపోలియన్ కుటుంబ ఆభరణాలు లక్ష్యంగా
భద్రతా వ్యవస్థపై విమర్శలు
ఫ్రెంచ్ రాజుల ఆభరణాలను ప్రదర్శించే అపోలో గ్యాలరీ ఇదే..!
ఇంత కఠినమైన భద్రతా ఏర్పాట్లు ఉన్న మ్యూజియంలో దొంగలు ఇంత సులభంగా ప్రవేశించగలగడం అధికారులు, ప్రజల్లో ప్రశ్నలు రేకెత్తించింది. ఈ కేసును ‘ఆర్గనైజ్డ్ దొంగతనం’గా నమోదు చేసిన పోలీసులు, దొంగలు ముందుగానే రెక్కీ చేసి ప్రణాళికబద్ధంగా ఈ పని చేసినట్లు చెబుతున్నారు. బ్రిగేడ్ డి రిప్రెషన్ డూ బాండిటిజమ్ (BRB) అనే ప్రత్యేక దళం ఈ కేసు దర్యాప్తు చేపట్టింది.
సీసీటీవీ ఫుటేజీలు, ట్రాఫిక్ కెమెరాలు పరిశీలించగా, దొంగలు A6 హైవే దిశగా పారిపోయినట్లు తెలిసింది. 1911లో మోనాలిసా చిత్రాన్ని లూవ్ నుండి దొంగిలించిన ఘటన తర్వాత ఇంత పెద్ద స్థాయిలో జరిగిన దొంగతనం ఇదే అని అధికారులు చెబుతున్నారు. 1983లో మ్యూజియం నుండి దొంగిలించబడిన రెండు ప్రాచీన కవచాలు దాదాపు 40 ఏళ్ల తర్వాత దొరికాయి. ఈ దొంగతనం భద్రతా వ్యవస్థలను మళ్లీ పునస్సమీక్షించాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది.
“ఈ రత్నాలకు మార్కెట్ విలువ చెప్పలేము. ఇవి ఫ్రాన్స్ చరిత్రకు ప్రాణం పోసే వారసత్వ సంపద.”
— లారెంట్ నూనెజ్, ఫ్రెంచ్ ఇంటీరియర్ మంత్రి
మ్యూజియం అధికారులు, పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించారు. దొంగిలించబడిన వస్తువుల పూర్తి జాబితా సిద్ధం చేస్తున్నారు. భద్రతా లోపాలు ఎక్కడ జరిగాయో గుర్తించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటైంది. ప్రపంచ ప్రసిద్ధ ప్రదర్శనశాల లూవ్ ఈ ఘటనతో మరోసారి వార్తల్లో నిలిచింది. “ఫ్రాన్స్ చరిత్రను ఎత్తుకెళ్లిన దొంగలు తప్పించుకోలేరు” అని స్థానిక పత్రికలు వ్యాఖ్యానించాయి.