తిరుమలలో నేటీ నుంచి ధార్మిక సదస్సు

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు నిర్వహించనున్నట్లుగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు

  • Publish Date - February 2, 2024 / 03:12 PM IST

విధాత : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు నిర్వహించనున్నట్లుగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఆస్థాన వేదిక మండపం వేదికగా జరుగనున్న ఈ ధార్మిక సదస్సుకు దేశంలోని 57మంది మఠాధిపతులు, పీఠాధిపతులు, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు హాజరుకాబోతున్నారన్నారు. ధార్మిక అంశాలపై చర్చించి చివరి రోజు తీర్మానాలు చేయడం జరుగుతుందని తెలిపారు. హిందూ ధర్మప్రచారం, పరిరక్షణ, సనాతన హిందూ ధర్మవిలువల వ్యాప్తి, విశిష్టతను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలు, సలహాలపై సదస్సులో చర్చించనున్నారు. పీఠాధి, మఠాధిపతులకు తగిన ఏర్పాట్లు చేసేందుకు ముగ్గురు సీనియర్‌ అధికారులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఒకో స్వామిజీకి ఒక లైజన్‌ అధికారిని నియమించారు. దర్శనం, వసతి, ఆహారం, రవాణా వంటి కమిటీలతో లైజన్‌ అధికారి సమన్వయం చేసుకుని స్వామిజీలకు తగిన ఏర్పాట్లు చేస్తారు.

Latest News