విధాత : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు నిర్వహించనున్నట్లుగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఆస్థాన వేదిక మండపం వేదికగా జరుగనున్న ఈ ధార్మిక సదస్సుకు దేశంలోని 57మంది మఠాధిపతులు, పీఠాధిపతులు, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు హాజరుకాబోతున్నారన్నారు. ధార్మిక అంశాలపై చర్చించి చివరి రోజు తీర్మానాలు చేయడం జరుగుతుందని తెలిపారు. హిందూ ధర్మప్రచారం, పరిరక్షణ, సనాతన హిందూ ధర్మవిలువల వ్యాప్తి, విశిష్టతను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలు, సలహాలపై సదస్సులో చర్చించనున్నారు. పీఠాధి, మఠాధిపతులకు తగిన ఏర్పాట్లు చేసేందుకు ముగ్గురు సీనియర్ అధికారులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఒకో స్వామిజీకి ఒక లైజన్ అధికారిని నియమించారు. దర్శనం, వసతి, ఆహారం, రవాణా వంటి కమిటీలతో లైజన్ అధికారి సమన్వయం చేసుకుని స్వామిజీలకు తగిన ఏర్పాట్లు చేస్తారు.
తిరుమలలో నేటీ నుంచి ధార్మిక సదస్సు
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు నిర్వహించనున్నట్లుగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు
Latest News

వామ్మో అనిపించేలా.. సుందర్ పిచాయ్ వేతనం!
తెలంగాణలో 40డిగ్రీలకు చేరిన ఉష్ఱోగ్రతలు
కోడిగుడ్లకు యుద్దం ఎఫెక్ట్..సగానికి తగ్గిన ధరలు!
అమానుషం..కుక్క పిల్లలను గోడకు కోట్టి చంపిన మహిళ
కలర్ కాటన్ క్రాప్స్ !..ఇక రంగుల పత్తి రంగప్రవేశం!!
గద్దర్ అవార్డులు – 2025: ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయి, ఉత్తమనటుడు – నాగచైతన్య
గణపతి లొంగుబాటు నేడే?
ఎన్ని తరాలు మారినా మొగుడు చెప్పిందే పెళ్లాం వినాల్సిందేనా.. జెన్ జెడ్లోనూ అవే పాతకాలపు ఆలోచనలు
పెరిగిన బంగారం..తగ్గిన వెండి
లతా నాయుడుతో విడాకులకు దరఖాస్తు చేసిన తరుణ్ భాస్కర్ : ట్రెండింగ్లో ఈషా రెబ్బా.!