Sania Mirza | డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వేదికగా జరిగిన రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకలకు భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా హాజరయ్యారు. పింక్ కలర్ డ్రెస్లో ఆమె మెరిసిపోయారు.
వీఐపీ గ్యాలరీలోని ముందు వరుసలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీతో పాటు సానియా మీర్జా ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా సానియా కవితతో ముచ్చటించారు.
ఈ ఏడాది మార్చి 5వ తేదీన ఎల్బీ స్టేడియం వేదికగా సానియా మీర్జా ఫేర్వెల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్తో ఆమె తన సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలికింది.
తన చివరి మ్యాచ్ సింగిల్స్లో సానియా vs రోహన్ బోపన్న.. డబుల్స్లో సానియా, బోపన్న జోడీ vs ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్ తలపడ్డారు.
ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం సానియా ఒక్కసారిగా భావోద్వేగానికిలోనై కంటతడి పెట్టుకుంది. ఈ చివరి మ్యాచ్ను చూసేందుకు అభిమానులతో పాటు రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో పాటు సినీ నటుడు దుల్కర్ సల్మాన్, మాజీ క్రికెటర్లు యువరాజ్సింగ్, అజారుద్దీన్, ప్రముఖ భారతీయ రాపర్, గీత రచయిత ఎంసీ స్టాన్ తదితరులు ఎల్బీ స్టేడియంకు వచ్చి మ్యాచ్ తిలకించారు.