Adilabad
విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: స్నేహితుల దినోత్సవం రోజున స్నేహితులందరు కలిసి విహారయాత్రకు బయలుదేరిన ఘటనలో విషాదం నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ వైద్య విజ్జాన సంస్థ (రిమ్స్) కు చెందిన పది మంది మెడికల్ విద్యార్థులు స్నేహితుల దినోత్సవం సందర్భంగా సరదాగ గడిపేందుకు ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని కుంభఝరి (శివఘాట్) గ్రామ శివారులోని కోటి లింగాలకు వెళ్ళారు.
తోటి స్నేహితులు అతడిని రక్షించేందుకు ఎంత ప్రయత్నించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. వాగులో గల్లంతైన విద్యార్థి ప్రవీణ్ స్వస్థతలం సిరిసిల్ల జిల్లా. ఈ సంఘటన విషయం తెలుసుకున్న మిగతా వైద్య విద్యార్థులు, గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
వాగులో గల్లంతైన వైద్య విద్యార్థి కోసం స్థానికులు, పోలీసులు కలిసి గాలింపును ముమ్మరం చేశారు. సోమవారం ఉదయం గల్లంతైన విద్యార్థి మృత దేహం లభ్యమైంది. పోస్టుమార్టం కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించగా కుటుంబ సభ్యులు, తోటి స్నేహితుల రోదనలతో ఆసుపత్రి వాతావరణం అంతా విషాదఛాయలు అలుముకున్నాయి.