ముంబై, జూన్ 29- మహా వికాస్ అఘాది(ఎంవీఏ) ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉధవ్ థాకరేను అంగీకరించడానికి ఎన్సీపీ నేత శరద్ పవార్ తిరస్కరించారు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎంవీఏ భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల ఒప్పందం కుదిరిన విషయం విదితమే. సమిష్ఠి నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లాలని శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ కూడా ఉధవ్ థాకరేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించబోమని ప్రకటించింది. ‘మా కూటమే మా ఫేస్. సమిష్టి నాయకత్వంలో ఎన్నికలను ఎదుర్కొంటాము’ అని పవార్ చెప్పారు. ముఖ్యమంత్రి ఎవరో చెప్పకుండా ఎన్నికలకు వెళితే నష్టం జరుగుతుందని శివసేన(ఉధవ్) నేత సంజయ్ రౌత్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘ఉధవ్ థాకరే ముఖ్యమంత్రిగా చాలా మంచిపనులు చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఆయనను చూసే ఎంవీఏకు ఎక్కువ ఓట్లు వేశారు’ అని రౌత్ అన్నారు. ఎన్సీపీ(శరద్) అధ్యక్షుడు జయంత్ పాటిల్ మాత్రం ఇప్పుడే ముఖ్యమంత్రి అభ్యర్థి విషయం ప్రకటించవద్దని భాగస్వామ్యపక్షాలను కోరారు.
ఉధవ్ను సీఎం అభ్యర్థిగా అంగీకరించం : పవార్
జూన్ 29- మహా వికాస్ అఘాది(ఎంవీఏ) ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉధవ్ థాకరేను అంగీకరించడానికి ఎన్సీపీ నేత శరద్ పవార్ తిరస్కరించారు.

Latest News
ఇప్పుడు నీ తోలు తీయాలా రేవంత్ రెడ్డి? : హరీశ్ రావు
ఏప్రిల్ 22 దాకా తెలంగాణలో విచిత్ర వాతావరణం : రోజూ ఎండలు, వానలు
బీచ్ లో ఆలల చెంత సింహం..ఫోటో, వీడియో వైరల్
హాట్ టాపిక్...గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ!
కోర్టు ధిక్కరణ.. అత్తాపూర్ ఆర్డీవోకు నెల రోజుల జైలు శిక్ష
శ్రీరాముడిపై వ్యాఖ్యలు..ప్రకాశ్రాజ్ వివరణ !
గుడ్ న్యూస్..హైదరాబాద్లో ఎంఎంటీఎస్లో ఫ్రీ జర్నీ!
ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ట్రెండ్ ..
అక్షయ తృతీయ బంగారం సేల్స్ పెరిగేనా..?
రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న దీపికా పదుకొనే- రణవీర్ సింగ్ జంట