ముంబై, జూన్ 29- మహా వికాస్ అఘాది(ఎంవీఏ) ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉధవ్ థాకరేను అంగీకరించడానికి ఎన్సీపీ నేత శరద్ పవార్ తిరస్కరించారు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎంవీఏ భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల ఒప్పందం కుదిరిన విషయం విదితమే. సమిష్ఠి నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లాలని శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ కూడా ఉధవ్ థాకరేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించబోమని ప్రకటించింది. ‘మా కూటమే మా ఫేస్. సమిష్టి నాయకత్వంలో ఎన్నికలను ఎదుర్కొంటాము’ అని పవార్ చెప్పారు. ముఖ్యమంత్రి ఎవరో చెప్పకుండా ఎన్నికలకు వెళితే నష్టం జరుగుతుందని శివసేన(ఉధవ్) నేత సంజయ్ రౌత్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘ఉధవ్ థాకరే ముఖ్యమంత్రిగా చాలా మంచిపనులు చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఆయనను చూసే ఎంవీఏకు ఎక్కువ ఓట్లు వేశారు’ అని రౌత్ అన్నారు. ఎన్సీపీ(శరద్) అధ్యక్షుడు జయంత్ పాటిల్ మాత్రం ఇప్పుడే ముఖ్యమంత్రి అభ్యర్థి విషయం ప్రకటించవద్దని భాగస్వామ్యపక్షాలను కోరారు.
ఉధవ్ను సీఎం అభ్యర్థిగా అంగీకరించం : పవార్
జూన్ 29- మహా వికాస్ అఘాది(ఎంవీఏ) ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉధవ్ థాకరేను అంగీకరించడానికి ఎన్సీపీ నేత శరద్ పవార్ తిరస్కరించారు.

Latest News
ప్రగతి అక్కా...పవర్ ఆఫ్ పవర్ లిఫ్టింగ్
స్పీకర్ గడ్డం ప్రసాద్ కు హరీష్ రావు ఘాటు లేఖ
పోయినసారి నన్ను గెలిపించారు.. ఈ సారి నా భార్యను గెలిపించండి
ఇండిగో నిర్వాకం..ఆరో రోజు విమానాల రద్దు
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న విరాట్ కోహ్లీ
బిగ్ బాస్లో ఈ వారం ఊహించని ఎలిమినేషన్..
ప్రొఫెసర్ లైంగికదాడి.. గర్భం దాల్చిన బీఈడీ విద్యార్థిని
చలికాలంలో వేడి నీళ్లతో స్నానమా..? ఈ నష్టాలు తప్పవు..!
ఇంటర్నేషనల్ స్టేజ్లో మెరుపు మెరిపించిన నటి ప్రగతి
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. 23 మంది సజీవదహనం