విధాత, హైదరాబాద్ : ఈవీఎంలను హ్యాకింగ్ చేయవచ్చన్న ఎలన్ మస్క్ వ్యాఖ్యలపై మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరీ మండిపడ్డారు. భారత్లో ఈవీఎంలను ఎంతమంది ప్రయత్నించినా హ్యాకింగ్ చేయలేరన్నారు. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చన్న ఎలన్ మస్క్ను భారత్కు పిలిపించి హ్యాకింగ్ చేసి చూపించాలని కేంద్రం అడగాలని సూచించారు. ఇప్పటికే భారత్లోని ఈవీఎంలు అనేక పరీక్షలను అధిగమించి విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాయన్నారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఈవీఎంల పనితీరుపై భారత్లో పలు రాజకీయ పార్టీలు సందేహాలు లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా ఓడిన పార్టీలు ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నాయి. తాజాగా ఏపీలో ఓడిపోయిన మాజీ సీఎం జగన్ సైతం ఈవీఎంల పనితీరుపై సందేహాపడ్డారు. ఆధారాలు లేనందునా ఏమి చేయలేమంటూ నిర్వేదం వ్యక్తం చేశారు. అటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ సైతం ఈవీఎంలను హ్యాకింగ్ చేయవచ్చన్న ఎలన్ మస్క్ వ్యాఖ్యలపై స్పందిస్తూ భారత్లోని ఈవీఎంలు బ్లాక్ బాక్స్ వంటివంటూ విమర్శలు చేశారు.
ఈవీఎంల హ్యాకింగ్కు ఎలన్ మస్క్ను భారత్కు పిలవాలి … బీజేపీ సీనియర్ నేత పురంధేశ్వరీ
ఈవీఎంలను హ్యాకింగ్ చేయవచ్చన్న ఎలన్ మస్క్ వ్యాఖ్యలపై మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరీ మండిపడ్డారు. భారత్లో ఈవీఎంలను ఎంతమంది ప్రయత్నించినా హ్యాకింగ్ చేయలేరన్నారు.

Latest News
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత
బీజేపీకి అన్నామలై రాజీనామా..తమిళనాట మరో కొత్త పార్టీ
పర్యావరణ విధ్వంసం..గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు: రాహుల్ గాంధీ ట్వీట్
కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు
అమ్మ పేరుతో మొక్కలు నాటండి: పవన్ కల్యాణ్