ముంబై: ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో తన సోదరి సుప్రియా సూలేపై తన భార్య సునేత్ర పవార్ను పోటీకి దింపి తప్పు చేశానని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు. బారామతి లోక్సభ స్థానంలో శరద్పవార్ కూతురు సుప్రియా సూలేపై ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పోటీచేసి ఓడిపోయిన విషయం విదితమే. సునేత్ర పవార్ ఆ తర్వాత రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. ముఖమంత్రి లడ్కీ బహన్ యోజన ప్రారంభం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అజిత్పవార్ మాట్లాడారు. అజిత్పవార్ లోక్సభ ఎన్నికలకు కొంతకాలం ముందు ఎన్సీపీ నుంచి విడిపోయి సంకీర్ణ ప్రభుత్వంలో చేరారు. ‘నేను నా చెల్లెళ్లందరినీ ప్రేమిస్తాను. కుటుంబాల్లోకి రాజకీయాలు రానివ్వకూడదు. నా చెల్లెపై నా భార్యను పోటీ పెట్టి తప్పు చేశాను. అలా జరిగి ఉండకూడదు. కానీ పార్లమెంటరీ పార్టీ ఆ నిర్ణయం చేసింది. అది తప్పని ఇప్పుడు భావిస్తున్నాను’ అని అజిత్పవార్ అన్నారు.
Ajit Pawar | సోదరిపై భార్యను పోటీ పెట్టి తప్పు చేశా : అజిత్పవార్
ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో తన సోదరి సుప్రియా సూలేపై తన భార్య సునేత్ర పవార్ను పోటీకి దింపి తప్పు చేశానని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు.

Latest News
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తోంది : ఈనెల 24న లేదా 27న
రాత్రి బెడ్లైట్ వేసుకొని పడుకుంటున్నారా..? గుండెజబ్బులు వచ్చే ప్రమాదం 50 శాతం అధికమట జాగ్రత్త
చీరల కోసం ఉదయం 4 గంటల నుంచే షోరూమ్ ముందు బారులు తీరిన మహిళలు.. ఎందుకంత డిమాండ్..?
రియల్ మీ బాహుబలి బ్యాటరీ మొబైల్ లాంచ్ డేట్ ఫిక్స్ !
క్యాబినెట్ పరిమాణంపై పరిమితులు.. దొడ్డిదోవన సలహాదారుల పేరిట పందేరం.. సేవ కోసమా? ప్రాపకం కోసమా?
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై జబర్ధస్త్ తగదు : హైకోర్టు కీలక ఆదేశాలు
అల్లు-మెగా వార్ నడుమ బన్నీ ఇంట్రెస్టింగ్ కామెంట్..
స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు..ఒక్క రోజులోనే రూ.9లక్షల కోట్ల సంపద హుష్ !
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత..పోలీసుల లాఠీచార్జ్
షాకింగ్.. ఢిల్లీ మెట్రో ప్లాట్ఫామ్పైనే మూత్ర విసర్జన చేసిన వ్యక్తి.. నెట్టింట విమర్శలు