న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయి మధ్యంతర బెయిల్పై ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన బెయిల్ గడువు ముగియడంతో ఆదివారం తీహార్ జైలులో లొంగిపోయారు. ఆయనకు రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 5 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అంతకు ముందు కేజ్రీవాల్ తన భార్య సునీతతో కలిసి కన్నాట్ ప్లేస్లోని హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం రాజ్ఘాట్లో మహాత్ముని సమాధిని సందర్శించి పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని తీహార్ జైలు నుంచే నడిపించేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉన్నదని ఆప్ ప్రకటించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపించేందుకు వీలు కల్పించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ చెప్పారు.
మధ్యంతర బెయిల్ ముగియడంతో మళ్లీ జైలుకు.. కేజ్రీవాల్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయి మధ్యంతర బెయిల్పై ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన బెయిల్ గడువు ముగియడంతో ఆదివారం తీహార్ జైలులో లొంగిపోయారు

Latest News
యూట్యూబ్లో.. దూసుకెళుతున్న ‘భాగ్యనగరంలో సారథి ప్రేమ’
వద్దనుకుంటే పెట్రోల్ కొనొచ్చు.. కానీ అధిక ధర చెల్లించాలి
తెలంగాణలో సర్(SIR) గడువు పెంపు
మమత ముస్లిం రిజర్వేషన్లకు మంగళం
రామరావణులుగా మహేశ్ బాబు, తారక్ లు..ఏఐ రామాయణ ట్రైలర్ వైరల్ !
జయలలిత బంగ్లాను కొనుగోలు చేయనున్న సీఎం విజయ్ !?
సీఎం విజయ్ ‘జన నాయగన్’ రిలీజ్ డేట్ ఫిక్స్ !
“తెలంగాణ రైజింగ్-2047” లక్ష్యం..ట్రిలియన్ డాలర్ల వ్యవస్థ: సీఎం రేవంత్ రెడ్డి
సైకిల్పై కేదార్నాథ్ కు సాహస యాత్ర..తోడుగా కుక్క!
దేశ పురోగతి మార్గం..నదుల అనుసంధానం : సీఎం చంద్రబాబు