న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయి మధ్యంతర బెయిల్పై ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన బెయిల్ గడువు ముగియడంతో ఆదివారం తీహార్ జైలులో లొంగిపోయారు. ఆయనకు రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 5 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అంతకు ముందు కేజ్రీవాల్ తన భార్య సునీతతో కలిసి కన్నాట్ ప్లేస్లోని హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం రాజ్ఘాట్లో మహాత్ముని సమాధిని సందర్శించి పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని తీహార్ జైలు నుంచే నడిపించేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉన్నదని ఆప్ ప్రకటించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపించేందుకు వీలు కల్పించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ చెప్పారు.
మధ్యంతర బెయిల్ ముగియడంతో మళ్లీ జైలుకు.. కేజ్రీవాల్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయి మధ్యంతర బెయిల్పై ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన బెయిల్ గడువు ముగియడంతో ఆదివారం తీహార్ జైలులో లొంగిపోయారు

Latest News
రాష్ట్రంలో భానుడి భగభగలు.. నేడు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు..!
తెలంగాణ నూతన గవర్నర్గా శివప్రతాప్ శుక్లా
శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే..!
ట్రెండింగ్లో ‘రయ్ రయ్ రా రా’.. చెర్రీ డాన్స్కు ఇండియా ఫిదా
మాస్టర్ టెలికమ్యూనికేషన్స్లో గెలాక్సీ ఎస్26 సిరీస్ విక్రయాలు ప్రారంభం
టి20 ప్రపంచకప్ సెమీస్: ఫైనల్లో టీమిండియా – మరోసారి సంజూ మ్యాజిక్
సంజూ తుఫాన్.. సెమీస్లో ఇంగ్లండ్ ముందు 254 పరుగుల కొండంత లక్ష్యం
111 జీవో పరిధిలో పొంగులేటి అక్రమ మైనింగ్.. వెంటనే బర్తరఫ్ చేయాలన్న బీఆర్ఎస్ నేత ప్రవీణ్
ఎంపీ మల్లు రవి భార్య భూమికి ఎన్వోసీ
వామ్మో... ఏఐ గ్లాసెస్తో ఇన్ని డేంజర్లా? మీ బెడ్రూమ్ యాక్టివిటీ కూడా చూసేస్తారు!