పోలీసు స్టేష‌న్‌లో పురుషాంగం కోసుకున్న ఓ వ్య‌క్తి.. ఎందుకో తెలుసా..?

ఓ మాన‌సిక విక‌లాంగుడు చేయ‌కూడ‌ని ప‌ని చేశాడు. పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని బాత్రూమ్‌లోకి వెళ్లి ప‌దునైన ఆయుధంతో పురుషాంగాన్ని కోసుకున్నాడు. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని జైస‌ల్మేర్ జిల్లాలో వెలుగు చూసింది.

  • Publish Date - June 11, 2024 / 08:22 AM IST

జైపూర్ : ఓ మాన‌సిక విక‌లాంగుడు చేయ‌కూడ‌ని ప‌ని చేశాడు. పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని బాత్రూమ్‌లోకి వెళ్లి ప‌దునైన ఆయుధంతో పురుషాంగాన్ని కోసుకున్నాడు. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని జైస‌ల్మేర్ జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. జైస‌ల్మేర్ జిల్లాకు చెందిన అబ్దుల్ వ‌షీద్(35) మాన‌సిక విక‌లాంగుడు. అయితే ఆదివారం రాత్రి అత‌ను కొంత మంది మ‌హిళ‌ల‌తో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని, వారిని లైంగిక వేధింపుల‌కు గురి చేసిన‌ట్లు పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు అబ్దుల్‌ను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు. సోమ‌వారం ఉద‌యం బాత్రూమ్‌కు వెళ్లిన అబ్దుల్.. త‌న వెంట తెచ్చుకున్న ప‌దునైన ఆయుధంతో పురుషాంగాన్ని కోసుకున్నాడు.

తీవ్ర ర‌క్త‌స్రావంతో బాధ‌ప‌డుతున్న అబ్దుల్‌ను పోలీసులు గ‌మ‌నించి, చికిత్స నిమిత్తం జోధ్‌పూర్‌కు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం అత‌ని ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు. ఇక వేధింపుల‌కు గురైన మ‌హిళ‌ల‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ కేసులో ద‌ర్యాప్తు కొన‌సాగుతోంద‌ని పోలీసులు తెలిపారు.

Latest News