Kaleshwaram HC Case | కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై స్టే ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు మంగళవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. రెండు వేర్వేరు పిటిషన్లను వేశారు. ఈ పిటిషన్లు బుధవారం కోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది జూలై చివర్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. 665 పేజీల రిపోర్టును ముగ్గురు సభ్యుల బృందం అధ్యయనం చేసి ప్రభుత్వానికి అందించారు.ఈ వివరాలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు ఇచ్చారు. ఈ రిపోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ ప్రాజెక్టు విషయంలో నియమాలు పాటించలేదని రిపోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికే ఈ రిపోర్టుపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే ఈ కమిషన్ ను ఏర్పాటు చేశారని గులాబీ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ పై ఒంటికాలిపై మండిపడుతోంది. మరో వైపు ఈ రిపోర్టును అసెంబ్లీలో చర్చకు పెట్టాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. ఈ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించి అన్ని పార్టీల అభిప్రాయం మేరకు ఏం చేయాలనేదానిపై నిర్ణయాన్ని ప్రకటిస్తామని సీఎం ప్రకటించారు. అయితే ఈ నివేదికపై కేసీఆర్, హరీశ్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయడంతో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననేది ఉత్కంఠగా మారింది.
Kaleshwaram HC Case | కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీఘోష్ నివేదిక: హైకోర్టులో స్టే కోరుతూ కేసీఆర్, హరీశ్ పిటిషన్
కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ నివేదికపై స్టే కోరుతూ కేసీఆర్, హరీశ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడంతో రాజకీయ ఉత్కంఠ పెరిగింది.

Latest News
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్
99డేస్ యాక్షన్ ప్లాన్ సక్సెస్ చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి
పవన్ కల్యాణ్ ‘ప్రాజెక్టు హనుమాన్ ’ స్టార్ట్ !
వాగులో బయటపడ్డ 1000 సంవత్సరాల విష్ణు మూర్తి విగ్రహం!
తెలుగు రాష్ట్రాల్లో చంద్ర గ్రహణం వేళ.. బ్లడ్ మూన్ సీన్ !
నా జాగాలోకి ఎందుకొచ్చారు..మీ టౌన్ లోకి వస్తే ఊరుకుంటారా?: ఏనుగు ఫైర్
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న గుంటూరు కారం!
యుద్దం వేళ...ఇరాన్ లో భూకంపం !
విరోష్’ రిసెప్షన్కు హైటెక్ సెక్యూరిటీ..
ఖమేనీ కదలికలు ఏళ్లుగా ట్రాకింగ్.. 60 సెకన్లలో లక్ష్యం పూర్తి