విధాత : హైదరాబాద్: గ్రూప్ పోస్టులు పెంచాలని, మెగా డీఎస్సీ ప్రకటించాలన్న తదితర నిరుద్యోగ డిమాండ్ల సాధనకు ఏబీవీపీ విద్యార్థి సంఘం మంగళవారం నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడి నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏబీవీపీ కార్యకర్తలు టీజీపీఎస్సీ కార్యాలయంవైపు దూసుకెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతోవారు కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన కొనసాగించగా వారిని పోలీసులు బలలవంతంగా అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, ఏబీవీపీ విద్యార్థులకు మధ్య తోపులాట కొంత ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను, నాయకులను ఒక్కొక్కరుగా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కార్యదర్శి ఝాన్సీ మాట్లాడుతూ గ్రూప్ 1, 2, 3 పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు. టీచర్ పోస్టుల సంఖ్యను పెంచి మెగా డీఎస్సీ నిర్వహించాలన్నారు. గ్రూప్-1 మెయిన్స్కి 1:100 పిలువాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల సంఖ్య పెంచే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రూప్-2, 3తోపాటు ఉపాధ్యాయ పోస్టులు చాలావరకు ఖాళీగా ఉన్న ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఎందుకు ఉద్యోక భర్తీ చేపట్టడం లేదంటూ విమర్శించారు.
ఏబీవీపీ టీజీపీఎస్సీ ముట్టడి ఉద్రికత్త తోపులాట..అరెస్టు
గ్రూప్ పోస్టులు పెంచాలని, మెగా డీఎస్సీ ప్రకటించాలన్న తదితర నిరుద్యోగ డిమాండ్ల సాధనకు ఏబీవీపీ విద్యార్థి సంఘం మంగళవారం నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడి నిర్వహించారు.

Latest News
కిషన్ రెడ్డికి, సంజయ్ కి కాస్తంత కూడా సిగ్గు లేదు..బీజేపీకి మహిళా బిల్లు పాస్ కావాలని లేదు
శవంతో పాటు కోటిన్నర బెంజ్ కారును పూడ్చిపెట్టిన చైనా ఫ్యామిలీ.. వీడియో వైరల్!
20న సీఎం రేవంత్ మేడిగడ్డ సందర్శన..నస్తూరపల్లిలో బహిరంగసభ
అంగరంగ వైభవంగా భద్రకాళీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
పవన్ కళ్యాణ్ ఆరోగ్యం నిలకడగా ఉంది ...
ఆర్తి అగర్వాల్ మరణానికి అసలు కారణాలు ఏంటి...
నా కొత్త పార్టీలోకి భారీగా చేరికలు : కల్వకుంట్ల కవిత
ఇక ఏపీలో ‘ప్రాజెక్ట్ పునర్విక’: మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
కన్నడ నేలపై మళ్లీ శివాంగి(చిరుత)ల పునరాగమనం!
లెన్స్కార్ట్ క్షమాపణలు.. బొట్టు, హిజాబ్, తిలకాలకు గ్రీన్ సిగ్నల్!