విధాత, హైదరాబాద్ : ఎన్టీఆర్ జిల్లా బోదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఆదివారం జరిగిన ప్రమాదంలో బాయిలర్ పేలి 20 మంది కార్మికులు గాయపడ్డారు. క్షతగ్రాతులు బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్కు చెందిన కూలీలుగా గుర్తించారు. క్షతగాత్రులను జగ్గయ్యపేట , విజయవాడ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
బోదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన బాయిలర్ పేలి ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. బాధితులకు అండగా నిలబడాలని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. పేలుడు ఘటనకు కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలిపారు. ప్రమాద బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు కంపెనీ నుంచి పరిహారం అందేలా చూడాలని అన్నారు. ప్రభుత్వం నుంచి కూడా సాయం అందిస్తామని సీఎం పేర్కొన్నారు.
బోదవాడలో పేలిన బాయిలర్,20మంది కార్మికులకు గాయాలు … సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు ఆదేశాలు
ఎన్టీఆర్ జిల్లా బోదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఆదివారం జరిగిన ప్రమాదంలో బాయిలర్ పేలి 20 మంది కార్మికులు గాయపడ్డారు. క్షతగ్రాతులు బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్కు చెందిన కూలీలుగా గుర్తించారు.

Latest News
వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు మూడు నెలల వేతన బకాయిలు చెల్లించండి!
జూలై 20నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
‘సర్’పై సుర్రుమంటున్న జనం.. ఫారాలు అందక ఎదురుచూపులు
కావేరి నది జలాలకు తమిళ ప్రజల సాంప్రదాయ పూజలు..వైరల్
ఒవైసీ కాలేజీ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్
ఇదేమి చోద్యం…హమామ్ సబ్బుతో పాముకు స్నానం..వైరల్ వీడియో
క్యాన్సర్ మందు అమెరికాలో రూ.85వేలు..భారత్ లో రూ.35: అమెరికన్ మహిళ వీడియో వైరల్
హైదరాబాద్ లో ఫుడ్ కల్తీపై 185 కేసుల నమోదు !
ఎక్స్పైరీ డేట్ ట్యాంపరింగ్ రాకెట్ గుట్టు రట్టు..ఆహార పదార్ధాలతో జాగ్రత్త!
20ఏళ్ల రాజకీయ ప్రయాణం..నా జీవితంలో ప్రత్యేక అధ్యాయం: సీఎం రేవంత్ రెడ్డి