విధాత, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రతినిధి: మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై 111 ఓట్ల తేడాతో నవీన్ కుమార్ రెడ్డి విజయం పొందారు. బాలుర జూనియర్ కళాశాలలో ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు రెండు గంటల్లో పూర్తి అయింది. 10.15 గంటలకే ఫలితం వెలువడింది. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే బీఆర్ఎస్ గట్టెక్కింది. మొత్తం 1437 ఓట్లు పోలవ్వగా 21 ఓట్లు చెల్లనవిగా అధికారులు గుర్తించారు. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డికి 763 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి 652 ఓట్లు వచ్చాయి. 111 మొదటి ప్రాధాన్యత ఓట్లతో నవీన్ కుమార్ రెడ్డి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు.
Mahabubnagar | ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ విజయం
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు

Latest News
ఇరాన్ యుద్ధనౌకను పేల్చేసిన అమెరికా.. శ్రీలంక సముద్రంలో ఘోర విషాదం, 87 మృతి!
టి20 ప్రపంచకప్ సెమీఫైనల్: ఫిన్ అలెన్ మెరుపు సెంచరీ – ఫైనల్లో న్యూజీలాండ్
వంట విషయంలో అత్తతో గొడవ.. టెకీ కోడలు బలవన్మరణం
అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం: హైడ్రా కమిషనర్
వరంగల్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం : ఇక ఐపీఎల్ మ్యాచ్లూ చూడొచ్చు.
నియోపోలిస్లో సీఎం మేనల్లుడి మనుషుల అక్రమ మైనింగ్
సుస్మిత సంగతి తెలుసుగా... కొమ్మాల వేదికగా కొండా మురళి వివాదాస్పద వ్యాఖ్యలు...
బెంగళూరు టూ హైదరాబాద్ ప్రయాణం.. ఇక రెండు గంటలే
టీడీఆర్పై రేవంత్ సర్కార్ యూటర్న్? మహారాష్ట్ర విధానం అమలు దిశగా కసరత్తు!
రెండు రాజ్యసభ స్థానాలకు సింఘ్వీ, నరేందర్ రెడ్డి పేర్లు ఖరారు!