విధాత, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలో ఓటమి నేఫథ్యంలో ఒడిస్సా సీఎం, బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ సీఎం పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బుధవారం గవర్నర్ రఘుబర్ దాస్కు అందచేశారు. నవీన్ పట్నాయక్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగే వరకు తాత్కాలిక సీఎంగా కొనసాగాలని కోరారు. 24 ఏళ్లపాటు ఏకధాటిగా ఒడిస్సాను పాలించిన బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్కు తొలిసారిగా ఓటమి ఎదురయ్యింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఓడిపోవడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. ఒడిస్సా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 147స్థానాలకు గాను బీజేపీ 78స్థానాల్లో విజయం సాధించింది. బిజూ జనతాదళ్ 51, కాంగ్రెస్ 14, ఇతరులు 4చోట్ల గెలుపొందారు. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ ఒడిస్సాలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతుంది.
గవర్నర్కు రాజీనామా సమర్పించిన.. సీఎం నవీన్ పట్నాయక్
అసెంబ్లీ ఎన్నికలో ఓటమి నేఫథ్యంలో ఒడిస్సా సీఎం, బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ సీఎం పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బుధవారం గవర్నర్ రఘుబర్ దాస్కు అందచేశారు. నవీన్ పట్నాయక్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు

Latest News
తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయ ద్వారాలు..రేపు బద్రీనాధ్
ఐపీఎల్ ఎఫెక్ట్: థియేటర్లలో చిన్న సినిమాలు మాత్రమే…
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
ఫ్లాప్ డెబ్యూ నుంచి పాన్-ఇండియా స్టార్ వరకు .. ఫహద్ ఫాసిల్ సినీ ప్రయాణం ఎలా మలుపు తిరిగింది?
నిర్మాత, నటుడు, అనలిస్ట్ త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత
బంతి పువ్వుతో ఆర్థిక కష్టాలు దూరం..! బుధవారం ఇలా చేయండి మరి..?
బుధవారం రాశిఫలాలు.. ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్త..!
ఇదెక్కడి చోద్యం? కాంట్రాక్టు ఉద్యోగి చేతికి ఐఏఎస్, ఐపీఎస్ ఫైళ్లు
రష్యా సర్కస్లో ప్రేక్షకుల మధ్యకు దూసుకెళ్లిన పులి.. వైరల్ వీడియో కలకలం
మే 1 నుంచి తెలంగాణ ప్రభుత్వోద్యోగుల బదిలీలు