విధాత, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలో ఓటమి నేఫథ్యంలో ఒడిస్సా సీఎం, బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ సీఎం పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బుధవారం గవర్నర్ రఘుబర్ దాస్కు అందచేశారు. నవీన్ పట్నాయక్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగే వరకు తాత్కాలిక సీఎంగా కొనసాగాలని కోరారు. 24 ఏళ్లపాటు ఏకధాటిగా ఒడిస్సాను పాలించిన బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్కు తొలిసారిగా ఓటమి ఎదురయ్యింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఓడిపోవడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. ఒడిస్సా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 147స్థానాలకు గాను బీజేపీ 78స్థానాల్లో విజయం సాధించింది. బిజూ జనతాదళ్ 51, కాంగ్రెస్ 14, ఇతరులు 4చోట్ల గెలుపొందారు. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ ఒడిస్సాలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతుంది.
గవర్నర్కు రాజీనామా సమర్పించిన.. సీఎం నవీన్ పట్నాయక్
అసెంబ్లీ ఎన్నికలో ఓటమి నేఫథ్యంలో ఒడిస్సా సీఎం, బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ సీఎం పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బుధవారం గవర్నర్ రఘుబర్ దాస్కు అందచేశారు. నవీన్ పట్నాయక్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు

Latest News
న నవ్వుతో సోషల్మీడియాను ఊపేసిన బాలుడు.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా!
ఎమ్మెల్యే గాంధీకి గోపన్ పల్లి జర్నలిస్ట్ కాలనీ వాసుల వినతి
బాసర నుంచి భద్రాచలం వరకు ప్రత్యేక 'దేవాలయ సర్క్యూట్' : కేబినెట్ సబ్ కమిటీ
పార్టీలో కొనసాగడంపై ఆలోచించే సమయం వచ్చింది: జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
లావణ్య త్రిపాఠిని కూడా వేధిస్తున్నారా ..
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీం ఊరట
కూతురు సుస్మితకు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..
అసెంబ్లీ సమరానికి కాంగ్రెస్... బీఆర్ఎస్ సన్నాహాలు!
అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకని సూర్యకిరణాలు!
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం..కొనసాగుతున్న చర్చ