విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ నేతల అరాచకం వల్లే రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరులో ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ కుటుంబాన్ని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిలు ఆదివారం పరామర్శించారు. అనంతరం నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభాకర్ పట్టా భూమిని అధికార పార్టీలోని నేతలే కబ్జా చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల దౌర్జన్యంతోనే ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతు ప్రభాకర్ సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదని, రైతు పొలంలో అక్రమంగా చొరబడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రైతు కుటుంబానికి బీఆరెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. మరోవైపు ప్రభాకర్ ఆత్మహత్యపై ఖమ్మం జిల్లా సీపీకి బీఆరెస్ నేతలు నిరంజన్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు ఫిర్యాదు చేశారు. అధికారులు సహకరించకపోవడం వల్లే రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
రైతు ప్రభాకర్ ఆత్మహత్యకు కాంగ్రెస్ నేతలే కారణం … మాజీ మంత్రి నిరంజన్రెడ్డి
కాంగ్రెస్ నేతల అరాచకం వల్లే రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరులో ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ కుటుంబాన్ని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిలు ఆదివారం పరామర్శించారు.

Latest News
‘తెలంగాణ’ పండుగ పూట ‘పంచాయతీ’…
టీఎంసీలో చీలికకు బీజేపీ యత్నాలు.. బెంగాల్లో ‘ఏక్నాథ్ షిండే’ ఎవరో…
దేశవ్యాప్తంగా లబ్ధిదారుల పేర్ల తొలగింపు జాతర
ఓటీటీలోకి వస్తున్న.. M4M (మోటివ్ ఫర్ మర్డర్)
పవన్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్
బెదిరింపులకు భయపడను..తెలంగాణలో జనసేన పోటీ : పవన్ కల్యాణ్
Buchi Babu | ఎన్టీఆర్ సినిమా పై బుచ్చిబాబు క్లారిటీ.. ‘పెద్ది’ కథతో ఎలాంటి సంబంధం లేదన్న దర్శకుడు
Cocktail 2 Trailer | ‘కాక్టెయిల్ 2’ ట్రైలర్ విడుదల.. షాహిద్, రష్మిక, కృతి లవ్ ట్రయాంగిల్కు ప్రేక్షకుల ఫిదా
మార్కెట్లోకి ఇథనాల్ బైక్లు, కార్లు.. ఇటీవలే స్టౌలు కూడా మార్కెట్లోకి
పాడిపంటల నినాదం..ఉరుగ్వే ప్రగతి పాఠం!