విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ నేతల అరాచకం వల్లే రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరులో ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ కుటుంబాన్ని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిలు ఆదివారం పరామర్శించారు. అనంతరం నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభాకర్ పట్టా భూమిని అధికార పార్టీలోని నేతలే కబ్జా చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల దౌర్జన్యంతోనే ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతు ప్రభాకర్ సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదని, రైతు పొలంలో అక్రమంగా చొరబడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రైతు కుటుంబానికి బీఆరెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. మరోవైపు ప్రభాకర్ ఆత్మహత్యపై ఖమ్మం జిల్లా సీపీకి బీఆరెస్ నేతలు నిరంజన్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు ఫిర్యాదు చేశారు. అధికారులు సహకరించకపోవడం వల్లే రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
రైతు ప్రభాకర్ ఆత్మహత్యకు కాంగ్రెస్ నేతలే కారణం … మాజీ మంత్రి నిరంజన్రెడ్డి
కాంగ్రెస్ నేతల అరాచకం వల్లే రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరులో ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ కుటుంబాన్ని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిలు ఆదివారం పరామర్శించారు.

Latest News
డిప్రెషన్తో బాధపడుతున్నారా..? ఈ సమస్యకు వ్యాయామంతో చెక్ పెట్టండి
దుమ్ము.. దుమ్ము అయిపోతావ్ : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు వార్నింగ్
తెలుగు శబ్ధమే అతి ప్రాచీనమైనది
గ్రీన్ ల్యాండ్ స్వాధీనానికి టైమ్ వచ్చేసింది: ట్రంప్ సంచలన పోస్టు
రూ.7 చోరీ కేసు.. 50 ఏళ్ల తర్వాత తుది తీర్పు.. ఇప్పటికీ దొరకని దొంగల ఆచూకీ..!
మూడు లగ్జరీ ఇళ్లు, కారు, వడ్డీ వ్యాపారాలు.. రూ.కోట్లకు పడగలెత్తిన బిచ్చగాడు.. విలాసాలు చూస్తే షాకే
వెండి ధర కొత్త రికార్డు..పెరిగిన బంగారం ధరలు
సంక్రాంతి 2026 బాక్సాఫీస్ విజేతలు యువ హీరోలే..
‘కొరియన్ కనకరాజు’తో వరుణ్ తేజ్ కంబ్యాక్పై అంచనాలు..
పూజా హెగ్డే సంచలన ఆరోపణలు..