విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ఈదురు గాలులు,భారీ వర్షానికి గోడ కూలి నలుగురు కూలీలు దుర్మరణం చెందారు. ఈ సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా తాడురు మండలం ఇంద్రకల్ గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. కోళ్ల ఫారం నిర్మాణం లో భాగంగా నిర్మిస్తున్న ప్రహరీ గోడ ఈదురు గాలులకు, భారీ వర్షం తోడు కావడం తో ఒక్కసారిగా గోడ కూలింది. అక్కడే పనిచేస్తున్న కొందరు కూలీలపై పడింది. ఈ సంఘటన లో నలుగురు కూలీలు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడ్డ వారిని నాగర్ కర్నూల్ ఆసుపత్రి కి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
ఇంద్రకల్ గ్రామంలో వర్షానికి గోడ కూలి నలుగురు కూలీలు దుర్మరణం
నాగర్ కర్నూల్ జిల్లా తాడురు మండలం ఇంద్రకల్ గ్రామంలో ఈదురు గాలులు,భారీ వర్షానికి గోడ కూలి నలుగురు కూలీలు దుర్మరణం చెందారు

Latest News
18న మేడారంలో తెలంగాణ కేబినెట్.. రేవంత్ ఉద్దేశం ఇదేనా..?
విషాదం : నాటు బాంబు వల్ల ఏనుగు పిల్ల మృతి
ఫ్యాటీ లివర్ సమస్యకు చక్కటి పరిష్కారం ముల్లంగి.. దీని ప్రయోజనాలు తెలిస్తే తినక మానరు..!
అడవి ఏనుగుల ఉన్మాదం – ఇద్దరు రైతుల దారుణ మరణం
మీకు తెలుసా.. రైలు ఆలస్యమైతే ఫ్రీగా ఫుడ్ పొందొచ్చు..!
పుట్టగొడుగుల సాగుతో.. నెలకు రూ. 2 లక్షలు సంపాదిస్తున్న ఒడిశా రైతు
విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ 33 ఫస్ట్ లుక్ రిలీజ్
అక్కడ కేఏ పాల్ లెవల్ వేరయా..!
2030 నాటికి దేశంలో గిగ్ వర్కర్లు 2 కోట్ల 35 లక్షలు..!
మన శంకర వర ప్రసాద్ గారి కలెక్షన్ల సునామీ : 5వ రోజునాటికి 150 కోట్లు