విధాత, హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను సమర్ధిస్తూ ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు కల్పిస్తూ సుప్రీం కోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 మెజార్టీతో ఇచ్చిన తీర్పు పట్ల ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. సుప్రీంకోర్టు తీర్పుతో మంద కృష్ణ మాదిగ భావోద్వేగానికి లోనయ్యారు. కోర్టు ముందు మీడియా ఎదుట ఆయన కంట నీరు పెట్టుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మా 20 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగిందని, సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించిందని వ్యాఖ్యానించారు. ఈ ప్రక్రియ వేగవంతానికి ప్రధానంగా చొరవ తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రులు అమిత్షా, కిషన్ రెడ్డిలకు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయాన్ని అమరులకు అంకితం ఇస్తున్నామని మందకృష్ణ మాదిగ చెప్పుకొచ్చారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటంలో చాలా మంది అసువులు బాశారని.. వర్గీకరణ ఉద్యమాన్ని దెబ్బ తీసేందుకు ఎన్నో కుట్రలు చేశారని అవేదన వ్యక్తం చేశారు. కానీ మొక్కవోని ధైర్యంతో ఏమాత్రం సహనం కోల్పోకుండా పట్టుదలతో పోరాటం చేసి విజయం సాదించామన్నారు. న్యాయం కోసం ఎమ్మార్పీఎస్కు అండగా నిలబడిన వారందరికీ ఈ విజయం అంకితమని మంద కృష్ణ మాదిగ అన్నారు. సుప్రీం కోర్టు తీర్పుతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు.
SC and ST Reservations | మంద కృష్ణ భావోద్వేగం..కేంద్ర మంత్రులకు కృతజ్ఞతలు
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను సమర్ధిస్తూ ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు కల్పిస్తూ సుప్రీం కోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 మెజార్టీతో ఇచ్చిన తీర్పు పట్ల ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు