విధాత, హైదరాబాద్ : కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం దానాపూర్లో అటవీశాఖ అధికారులు, పోడు రైతులమధ్య గొడవతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అటవీ భూముల సర్వేకు వెళ్లిన అధికారులను పోడు రైతులు అడ్డుకుని వారితో వాగ్వివాదానికి,తోపులాటకు దిగడంతో ఉద్రిక్తతకు దారితీసింది. తరతరాలుగా తమ సాగు చేసుకుంటున్న తమ భూముల్లో సర్వేలు చేయానికి వీళ్లేదని పోడు రైతులు అడ్డుకున్నారు. గ్రామం పరిధిలో దాదాపు 160 ఎకరాల భూమిని ఈ గ్రామానికి చెందిన దాదాపు 60 కుటుంబాల రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ భూములను స్వాధీనం చేసుకునేందుకు అటవీశాఖ అధికారులు శుక్రవారం దానాపూర్ వెళ్లగా గ్రామస్తులు వారిని అడ్డుకోవడంతో అటవీ అధికారులు వెనుతిరిగారు.
దానాపూర్లో మళ్లీ పోడు రైతుల ఆందోళన
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం దానాపూర్లో అటవీశాఖ అధికారులు, పోడు రైతులమధ్య గొడవతో ఉద్రిక్తత చోటుచేసుకుంది

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు