న్యూఢిల్లీ: తెలంగాణకు కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. మంగళవారం ఆయన ఢిల్లీలో నడ్డాతో సమావేశమయ్యారు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) 2023-24 మూడు, నాలుగు త్రైమాసికాల నిధులు రూ.323.73 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్హెచ్ఎంలో 2024-25 మొదటి త్రైమాసిక గ్రాంట్ రూ.231.40 కోట్లు మంజురు చేయాలని వినతి కోరారు. ఎన్హెచ్ ఎంకు సంబంధించి కేంద్రం నుంచి రావల్సిన నిధులు ఆలస్యం కావడంతో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా, సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాష్ట్ర వాటాతోపాటు కేంద్రం నుంచి రావల్సిన వాటా మొత్తాన్ని 2023, అక్టోబరు నుంచి తామే విడుదల చేస్తున్నామని కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. ఎన్ హెచ్ ఎం కింద తెలంగాణకు రావల్సిన పెండింగ్ నిధులు సత్వరమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
బకాయిలు విడుదల చేయండి … కేంద్ర ఆరోగ్యమంత్రికి సీఎం వినతి
తెలంగాణకు కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. మంగళవారం ఆయన ఢిల్లీలో నడ్డాతో సమావేశమయ్యారు

Latest News
బ్యాక్ లెస్ అందాలతో రెచ్చిపోయిన రకుల్ ప్రీత్
రాష్ట్రంలో రూ. 2,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న అక్షత్ గ్రీన్టెక్ సంస్థ
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు అసహనం
రేపటి పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్దం : ఈసీ
హీరోలు నా ముందు హీల్స్ వేసుకుంటారు..
తిరుమల పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
అక్కడ లగ్జరీ కార్ల కంటే..గుర్రాలకే ధర ఎక్కువ
రణవీర్ సింగ్ సక్సెస్కు వెనక కారణం సంఖ్యాశాస్త్రమా..
యూనెస్కో జాబితాలో దీపావళి ఫెస్టివల్
ఇండిగో విమానాల రద్దుపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం