న్యూఢిల్లీ: తెలంగాణకు కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. మంగళవారం ఆయన ఢిల్లీలో నడ్డాతో సమావేశమయ్యారు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) 2023-24 మూడు, నాలుగు త్రైమాసికాల నిధులు రూ.323.73 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్హెచ్ఎంలో 2024-25 మొదటి త్రైమాసిక గ్రాంట్ రూ.231.40 కోట్లు మంజురు చేయాలని వినతి కోరారు. ఎన్హెచ్ ఎంకు సంబంధించి కేంద్రం నుంచి రావల్సిన నిధులు ఆలస్యం కావడంతో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా, సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాష్ట్ర వాటాతోపాటు కేంద్రం నుంచి రావల్సిన వాటా మొత్తాన్ని 2023, అక్టోబరు నుంచి తామే విడుదల చేస్తున్నామని కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. ఎన్ హెచ్ ఎం కింద తెలంగాణకు రావల్సిన పెండింగ్ నిధులు సత్వరమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
బకాయిలు విడుదల చేయండి … కేంద్ర ఆరోగ్యమంత్రికి సీఎం వినతి
తెలంగాణకు కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. మంగళవారం ఆయన ఢిల్లీలో నడ్డాతో సమావేశమయ్యారు

Latest News
మున్సి‘పోల్స్’లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ? బీజేపీ నామమాత్రమేనా...
2025లో టాప్ 10 భయంకర విమాన మార్గాలు ఇవే.!
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై లైంగిక వేధింపుల కలకలం
రాష్ట్రంలో విజయవంతంగా ముగిసిన పులుల గణన సర్వే
భారత–ఐరోపా సమాఖ్యల చరిత్రాత్మక ఒప్పందం : అన్ని ఒప్పందాలకు అమ్మ
అశాస్త్రీయంగా జీహెచ్ఎంసీ డివిజన్ల విభజన : ఈటల రాజేందర్
కిటెక్స్ సంస్థకు ఈడీ సమన్లు.. ట్వంటీ20ని ఎన్డీయేలో చేర్చిన కిటెక్స్ అధినేత
నేను విద్యాశాఖ మంత్రినైతే కార్పోరేట్ స్కూళ్లను బంద్ చేస్తా : మంత్రి కోమటి రెడ్డి
హైదరాబాద్.. ఇక వర్టికల్ సిటీ! ఆకాశహర్మ్యాలలో మనమే టాప్.. ఎన్నో తెలిస్తే షాకే!!
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల