న్యూఢిల్లీ: తెలంగాణకు కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. మంగళవారం ఆయన ఢిల్లీలో నడ్డాతో సమావేశమయ్యారు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) 2023-24 మూడు, నాలుగు త్రైమాసికాల నిధులు రూ.323.73 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్హెచ్ఎంలో 2024-25 మొదటి త్రైమాసిక గ్రాంట్ రూ.231.40 కోట్లు మంజురు చేయాలని వినతి కోరారు. ఎన్హెచ్ ఎంకు సంబంధించి కేంద్రం నుంచి రావల్సిన నిధులు ఆలస్యం కావడంతో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా, సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాష్ట్ర వాటాతోపాటు కేంద్రం నుంచి రావల్సిన వాటా మొత్తాన్ని 2023, అక్టోబరు నుంచి తామే విడుదల చేస్తున్నామని కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. ఎన్ హెచ్ ఎం కింద తెలంగాణకు రావల్సిన పెండింగ్ నిధులు సత్వరమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
బకాయిలు విడుదల చేయండి … కేంద్ర ఆరోగ్యమంత్రికి సీఎం వినతి
తెలంగాణకు కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. మంగళవారం ఆయన ఢిల్లీలో నడ్డాతో సమావేశమయ్యారు

Latest News
‘భద్రకాళి’ పూడికతీత స‘కాలం’లో పూర్తయ్యేనా?
విప్ప సారా ప్రతిపాదనలు పరిశీలిస్తున్నాం: మంత్రి జూపల్లి
దేశంలో వంటగ్యాస్ కొరత లేదు: కేంద్రం కీలక ప్రకటన
75సెంట్ల భూమిలో 52రకాల పంటలు.. నెలకు రూ.20వేల ఆదాయం!
గ్యాస్ కొరత పరిష్కరానికి మానిటరింగ్ కమిటీలు : మంత్రి ఉత్తమ్
తెలుగు రాష్ట్రాల రైల్వేప్రయాణీకులకు కేంద్రం గుడ్న్యూస్
రేవంత్ బినామీ కంపెనీ అక్రమాలపై దర్యాప్తు జరిపించాలి : కేంద్ర మంత్రులకు కేటీఆర్ లేఖ
66 ఏళ్ల వయస్సులో ఆ నటి తల్లి కాబోతుంది అంటూ వార్తలు ...
మూసీ సుందరీకరణ డీపీఆర్ ఎక్కడా..? ప్రజల ముందు పెట్టు: హరీశ్ రావు
తమిళనాడులో శశికళ కొత్త పార్టీ ప్రారంభం