దేశంలో వంటగ్యాస్‌ కొరత లేదు: కేంద్రం కీలక ప్రకటన

దేశంలో వంట గ్యాస్ కొరత లేదని కేంద్ర పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ స్పష్టం చేశారు. అనవసరంగా ఎక్కువగా సిలిండర్లు బుక్ చేయొద్దని వినియోగదారులకు సూచించారు.

Sujatha Sharma petroleum ministry

విధాత : దేశంలో వంట గ్యాస్(LPG) కొరత లేదని కేంద్ర పెట్రోలియం శాఖ జాయింట్‌ సెక్రటరీ సుజాత శర్మ కీలక ప్రకటన చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ చమురు, వంటగ్యాస్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సుజాత శర్మ స్పష్టం చేశారు. అవసరం లేకపోయినా ఆందోళనలతో వంట గ్యాస్ బుక్‌ చేయొద్దని సూచించారు.

జలసంధి మూసివేయడం ఆందోళన కలిగించే విషయం అని, అయితే దేశంలోని పెట్రోల్ పంపుల వద్ద పెట్రోల్ , డీజిల్ నిల్వలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఎల్పీజీ గ్యాస్ విషయానికొస్తే అనవసర ఆందోళనతో అధిక డిమాండ్ నెలకొందన్నారు. అయినప్పటికీ మా 25,000 మంది పంపిణీదారులలో ఎక్కడా వంట గ్యాస్ నిల్వలకు కొరత లేదని స్పష్టం చేశారు.

గృహ గృహాలకు నిరంతరాయంగా సరఫరా చేయడానికి అవసరమైన అన్ని చర్యలు కొనసాగుతున్నాయని సుజాత శర్మ తెలిపారు.ఆసుపత్రులు, విద్యా సంస్థలకు కూడా ఎల్పీజీ సరఫరా జరుగుతుందని, మార్చి 5 తర్వాత దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి 30% పెరిగిందని వెల్లడించారు. వాణిజ్య సిలిండర్ల విషయానికొస్తే పంపిణీ వేగవంంతం కోసం రాష్ట్రాలను ఆదేశించామని, వినియోగదారులకు సమర్థవంతంగా చేరేలా చూసుకోవాలని మేము రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థిస్తున్నామని తెలిపారు.

నేటి నాటికి, మాకు 1.5 కోట్ల మంది పీఎన్జీ దేశీయ వినియోగదారులు ఉన్నారని, వారందరికీ సరఫరా కొరత లేదని, వారితో పాటు సమీపంలోని పీఎన్టీ కనెక్టివిటీ ఉన్న దాదాపు 60 లక్షల కుటుంబాలు సులభంగా పీఎన్జీ కనెక్షన్ పొందవచ్చని తెలిపారు. ఎల్పీజీపై కొంత ఒత్తిడిని తగ్గించేందుకు.. ఆ వినియోగదారులు పీఎన్జీ కనెక్షన్‌లను ఎంచుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

కిరోసిన్ పంపిణీ కోసం రాష్ట్రాలు తమ జిల్లాల్లోని నిర్దిష్ట ప్రదేశాలను గుర్తించాలని సూచించామని సుజాత శర్మ తెలిపారు. ప్రత్యేకంగా భారత ప్రభుత్వం సాధారణ కోటాకు అదనంగా 48,000 కిలో లీటర్ల అదనపు కేటాయింపును మంజూరు చేసింది. ప్రత్యామ్నాయ ఇంధన ఎంపికలను సక్రియం చేయడానికి, కోల్ ఇండియా ఇప్పటికే చిన్న, మధ్యస్థ మరియు ఇతర వినియోగదారులకు బొగ్గు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

Guntur Farmer Roshaiah : 75సెంట్ల భూమిలో 52రకాల పంటలు.. నెలకు రూ.20వేల ఆదాయం!
గ్యాస్ కొరత పరిష్కరానికి మానిటరింగ్ కమిటీలు : మంత్రి ఉత్తమ్

Latest News