విధాత, హైదరాబాద్: ఏఈఈ సివిల్ ఉద్యోగుల నియామకాలకు సంబంధించి ఎంపిక జాబితాను వెంటనే విడుదల చేయాలని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ను నందినగర్లోని ఆయన నివాసంలో ఏఈఈ సివిల్ రాసిన అభ్యర్థులు కలిశారు. బీఆరెస్ ప్రభుత్వ హయాంలో నోటిఫై చేసిన 1180 పోస్టులకు పరీక్షలు జరిగాయని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పరీక్షకు సంబంధించిన ఎంపిక జాబితాను పెండింగ్లో పెట్టిందని అభ్యర్థులు కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన కేటీఆర్ సమస్యపై టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డితో మాట్లాడారు. సెలక్షన్ జాబితాను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు. 1180 ఏఈఈ సివిల్ పోస్టుల ఎంపిక జాబితాను ప్రకటించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ ఒక ప్రకటనలో ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు తుది జాబితాను విడుదల చేయటం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరితో అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే జాబితా ప్రకటించాలని కేటీఆర్ కోరారు.
ఏఈఈ ఎంపిక జాబితాను వెల్లడించండి టీజీపీఎస్సీ చైర్మన్కు ..కేటీఆర్ వినతి
ఏఈఈ సివిల్ ఉద్యోగుల నియామకాలకు సంబంధించి ఎంపిక జాబితాను వెంటనే విడుదల చేయాలని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారు

Latest News
Avore Electric | చైనా విడిభాగాలు వాడకుండా.. పూర్తి స్వదేశీ టెక్నాలజీతోనే ఎలక్ట్రిక్ బైక్!
Realme P4R | 8000mAh భారీ బ్యాటరీతో రియల్మీ సరికొత్త ఫోన్.. ఒక్కసారి చార్జ్ చేస్తే21.5 గంటలు నాన్స్టాప్ యూట్యూబ్ వీడియోలు చూడొచ్చు!!
Madhu Yaskhi | అమెరికాలో కారు ప్రమాదం.. మధుయాష్కీ గౌడ్ సతీమణి డాక్టర్ సుచికి తీవ్ర గాయాలు
లొంగిపోయిన మావోయిస్టుల పయనమెటు!?
పవన్ కళ్యాణ్ పై గద్దర్ కూతురు వెన్నెల ఫైర్.!
పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరణ సరికాదు: చంద్రబాబు
తెలంగాణ భూమి పుత్రులే పోటీ చేస్తామంటే అభ్యంతరం ఎందుకు? : పవన్ కల్యాణ్
భుజంగరావును అరెస్టు చేసిన ఏసీబీ..రూ.5.92కోట్ల ఆస్తుల గుర్తింపు
తెలంగాణలో ఎల్లుండి నుంచి భూముల విలువ పెంపు : మంత్రి పొంగులేటి
సోలార్ ప్యానెల్ వ్యర్థాలతో ఢిల్లీకి కొత్త ముప్పు.. గ్రీన్ ఎనర్జీ వెనుక కాలుష్య సంక్షోభం