విధాత, హైదరాబాద్: ఏఈఈ సివిల్ ఉద్యోగుల నియామకాలకు సంబంధించి ఎంపిక జాబితాను వెంటనే విడుదల చేయాలని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ను నందినగర్లోని ఆయన నివాసంలో ఏఈఈ సివిల్ రాసిన అభ్యర్థులు కలిశారు. బీఆరెస్ ప్రభుత్వ హయాంలో నోటిఫై చేసిన 1180 పోస్టులకు పరీక్షలు జరిగాయని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పరీక్షకు సంబంధించిన ఎంపిక జాబితాను పెండింగ్లో పెట్టిందని అభ్యర్థులు కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన కేటీఆర్ సమస్యపై టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డితో మాట్లాడారు. సెలక్షన్ జాబితాను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు. 1180 ఏఈఈ సివిల్ పోస్టుల ఎంపిక జాబితాను ప్రకటించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ ఒక ప్రకటనలో ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు తుది జాబితాను విడుదల చేయటం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరితో అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే జాబితా ప్రకటించాలని కేటీఆర్ కోరారు.
ఏఈఈ ఎంపిక జాబితాను వెల్లడించండి టీజీపీఎస్సీ చైర్మన్కు ..కేటీఆర్ వినతి
ఏఈఈ సివిల్ ఉద్యోగుల నియామకాలకు సంబంధించి ఎంపిక జాబితాను వెంటనే విడుదల చేయాలని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారు

Latest News
నేడు తెలంగాణలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు !
ఎన్ని తరాలు మారినా మొగుడు చెప్పిందే పెళ్లాం వినాల్సిందేనా.. జెన్ జెడ్లోనూ అవే పాతకాలపు ఆలోచనలు
పెరిగిన బంగారం..తగ్గిన వెండి
విడాకులకి అప్లై చేసిన తరుణ్ భాస్కర్ ..
Netflix Studios | హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ స్టూడియోస్.. ఈ నెల12న ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
మరో యువ హీరో పెళ్లికి సిద్ధమయ్యాడా..
సోమాజిగూడలో భారీ అగ్నిప్రమాదం.. వైన్ షాపు దగ్ధం
గృహిణులకు షాక్.. భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు.. హైదరాబాద్లో ధర ఎంతంటే..?
రెండున్నర ఎకరాల్లో 70 టన్నుల అరటి పండ్ల ఉత్పత్తి.. ఏడాదిలోపే రూ. 12 లక్షల ఆదాయం
ముగ్గు పోయని వారికి ఇందిరమ్మ ఇల్లు రద్దు.. జాబితా సిద్ధం చేస్తోన్న అధికారులు..!