విధాత, హైదరాబాద్: ఏఈఈ సివిల్ ఉద్యోగుల నియామకాలకు సంబంధించి ఎంపిక జాబితాను వెంటనే విడుదల చేయాలని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ను నందినగర్లోని ఆయన నివాసంలో ఏఈఈ సివిల్ రాసిన అభ్యర్థులు కలిశారు. బీఆరెస్ ప్రభుత్వ హయాంలో నోటిఫై చేసిన 1180 పోస్టులకు పరీక్షలు జరిగాయని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పరీక్షకు సంబంధించిన ఎంపిక జాబితాను పెండింగ్లో పెట్టిందని అభ్యర్థులు కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన కేటీఆర్ సమస్యపై టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డితో మాట్లాడారు. సెలక్షన్ జాబితాను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు. 1180 ఏఈఈ సివిల్ పోస్టుల ఎంపిక జాబితాను ప్రకటించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ ఒక ప్రకటనలో ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు తుది జాబితాను విడుదల చేయటం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరితో అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే జాబితా ప్రకటించాలని కేటీఆర్ కోరారు.
ఏఈఈ ఎంపిక జాబితాను వెల్లడించండి టీజీపీఎస్సీ చైర్మన్కు ..కేటీఆర్ వినతి
ఏఈఈ సివిల్ ఉద్యోగుల నియామకాలకు సంబంధించి ఎంపిక జాబితాను వెంటనే విడుదల చేయాలని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారు

Latest News
ఆ ఆరు హత్యలు ఎందుకు చేశానంటే.. షాబాద్ కిరాతకుడి సెల్ఫీ వీడియో
CPS నుంచి OPSకు మారేందుకు ఏపీ ప్రభుత్వ నిర్ణయం.. తెలంగాణలోనూ అవకాశం కల్పించాలి
మాఝీ లడ్కీ బహిన్ యోజనలో 92 లక్షల మంది మరాఠా మహిళల పేర్ల తొలగింపు
తెలంగాణకు ఐఐఎం సాధించుకోవాలి
ఉద్యమకారుల శాశ్వత రక్షణకు కమిషన్
ప్రవహిస్తున్న నీటి నుంచే లిఫ్ట్ చేసుకునే వీలుంటే బ్యారేజీలు ఎందుకు కట్టారు?
తెలంగాణ కాంగ్రెస్ లో మండల కమిటీల చిచ్చు..!
కొమ్ములతో సందర్శకుడిని గాల్లో ఎగరేసిన బైసన్ దున్న
నీళ్లు అడిగితే…సైకో మాటలు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
బడికి వెళ్లాలంటే తాళ్ల వంతెన ట్రాలీ సాహసయాత్ర చేయాల్సిందే..!