విధాత: ఈనెల 24 నుంచి శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొంది. ఈ ఏడాది మార్చి 25తో గత శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఆ తర్వాత ఆరు నెలలలోపు విధిగా సభను నిర్వహించాలి. పదో తేదీన వినాయకచవితి కాగా.. 19న నిమజ్జనోత్సవం జరగనుంది.ఈ కార్యక్రమం అనంతరమే ఉభయ సభల సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.