విధాత, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీ వరకు 8రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సంతాప తీర్మానం పిదప సమావేశాలను బుధవారానికి స్పీకర్ వాయిదా వేశారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలోని స్పీకర్ చాంబర్లో బీఏసీ(బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశమైంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్లు, బీఆరెస్ నుంచి మాజీ మంత్రి టి.హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి బలాల హాజరయ్యారు. సమావేశాలను 8రోజుల పాటు ఈ నెలాఖరు వరకు నిర్వహించాలని నిర్ణయించారు. బుధవారం రైతు రుణమాఫీపై చర్చ, 25వ తేదీన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అదే రోజు ఉదయమే బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అనంతరం డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టి చదివి వినిపిస్తారు.
T.G Assembly | ఈనెల 31వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు … బుధవారం రైతు రుణమాఫీపై చర్చ
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీ వరకు 8రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Latest News
మోదీ పర్యటనపై తెలంగాణ బీజేపీ భారీ ఆశలు
15 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అదనపు పని వేళలు.. ఈ నెల12 నుంచి అమలులోకి
బండి సంజయ్ని భర్తరఫ్ చేయాలి :బీఆరెస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
రేపు మధ్యాహ్నం తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం
పశ్చిమ బెంగాల్ లో కొలువుతీరిన బీజేపీ తొలి సర్కార్
విజయ్ కి దొరికిన మెజార్టీ... గవర్నర్ తో భేటీ
అభిమానుల మధ్య ఘనంగా విజయ్ దేవరకొండ బర్త్డే సెలబ్రేషన్స్..
ఫిఫా 2026 ఓపెనింగ్ సెర్మనీలో నోరా ఫతేహి సందడి..
అషు రెడ్డి ఎంగేజ్మెంట్ ట్విస్ట్..
తాజా ఎన్నికల్లో 104 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఎన్నిక