విధాత, హైదరాబాద్ : ఇండియన్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్కు ఇంటి స్థలం కేటాయిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూబ్లీ హిల్స్ లో 600 చదరపు గజాల స్థలం కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రకటన మేరకు ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. జూబ్లీహిల్స్లోని వార్డు నెంబర్ 9, రోడ్ నెంబర్ 78లో సర్వే నెంబర్ 403పీలో 600గజాల స్థలం కేటాయించినట్లుగా ఉత్తర్వుల్లో పేర్కోన్నారు. సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రానికి చెందిన బాక్సర్ నిఖత్ జరీన్కు, సిరాజ్కు ఇంటి స్థలం, డీఎస్పీ ఉద్యోగాలు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు మంత్రి మండలిలో తీర్మానం చేసి అసెంబ్లీలో ఆమోదం తీసుకున్నారు. అయితే గతంలోనే జరీన్కు ఇంటి స్థలం కేటాయించి ఉండటంతో ఇప్పుడు సిరాజ్కు ఇంటి స్థలం కేటాయించారు.
TELANGANA GOVT | టీమిండియా క్రికెటర్ సిరాజ్కు ఇంటి స్థలం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఇండియన్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్కు ఇంటి స్థలం కేటాయిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూబ్లీ హిల్స్ లో 600 చదరపు గజాల స్థలం కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు

Latest News
తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం
అనన్య నాగళ్ల థండర్ థైస్ షో.. మామూలుగా లేదు భయ్యా!
చలికాలంలో ఇళ్లలో హీటర్స్ వాడటం ఎంత సేఫ్?
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి