ప్రజా ప్రభుత్వం ముసుగు క్రమంగా తొలగిపోతుంది. హక్కుల కోసం..సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నిస్తున్న గొంతులపై అణిచివేత అస్త్రం ప్రయోగిస్తుంది. ఇందుకు నిదర్శనంగా.. ముందు వడ్లు కొనండి అని కామెంట్స్ చేసిన ఆర్టీసీ డ్రైవర్పై పాలక వర్గం వేటు వేసింది. ఇప్పుడి వివాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..ప్రభుత్వం తీరుపైన నెటిజన్లు మండిపడుతున్నారు.
అసలు ఏం జరిగిందీ..?
పెట్రోల్ ధరల పెంపుపై జగిత్యాలలో కాంగ్రెస్ నిరసన ర్యాలీలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పాల్గొన్నారు. ధర్నా నేపథ్యంలో బస్స్టాండ్కు వస్తున్న ఆర్టీసీ బస్సును పోలీసులు దారి మళ్లించారు. బస్సు డ్రైవర్ అశోక్ ధర్నాను గమనిస్తూ.. ముందు ధాన్యం, మక్కలు కొనండి..తర్వాత పెట్రోల్ ధరలు ఎప్పుడైనా దించుకోవచ్చంటూ వ్యాఖ్యలు చేశారు. అశోక్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో ప్రభుత్వం అసహనానికి గురైంది.
డ్రైవర్ ఆశోక్ పై ఆర్టీసీ యాజమాన్యం సస్పెన్షన్ వేటు వేసింది. తనను విధుల్లోకి రావొద్దని రీజినల్ మేనేజర్ రిమూవల్ లెటర్ పంపినట్లు అశోక్ వెల్లడించారు. ఆర్డీసీ డ్రైవర్ పట్ల ప్రభుత్వం తీసుకున్న చర్యపై జనాల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి వినిపిస్తుంది. అశోక్ కు తప్పు ఏం మాట్లాడలేదని..క్షేత్ర స్థాయిలో ధాన్యం, మక్కల కొనుగోలులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓ కార్మికుడి మనసుతో స్పందించారంటూ తమ మద్దతు తెలుపుతున్నారు.
జగిత్యాలలో ఆర్టీసీ డ్రైవర్ అశోక్పై అధికారులు చర్యలు తీసుకున్నారు.
నిన్న కాంగ్రెస్ నాయకులు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ధర్నా చేస్తున్న సమయంలో మా ఊరి వ్యక్తితో నేను మాట్లాడిన.
అక్కడ మా ఊరి వ్యక్తి ఉండగా, డీజిల్, పెట్రోల్ గురించి కాదు.. ముందు వడ్లు, మొక్కజొన్నలు కొనండి అని ఆ… https://t.co/M0YL30CIrF pic.twitter.com/KZdx59nhKu
— Telangana First (@TelanganaFirst_) May 26, 2026
ఇవి కూడా చదవండి :
ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?.. అయితే బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లే.. నిర్లక్ష్యం వద్దు ప్రాణాలకే ప్రమాదం!
ఆ ముగ్గురి ఐపీఎస్ లను సస్పెండ్ చేసిన సీఎం విజయ్
