విధాత, వరంగల్ ప్రతినిధి: వరంగల్ నగర పరిధిలో గెలుపొందిన మంత్రితో సహా నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీకి పరిపాలన చేయడం రావడంలేదని ట్రాన్స్ జెండర్ పుష్పిత లయ మండిపడ్డారు. వీరి నిర్లక్ష్యం వల్ల వరద ముంపుతో ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి చీర, గాజులు పసుపు,కుంకుమలు పంపిస్తామని మీడియా సమావేశంలో తెలిపారు. ఈ దుస్థితికి కబ్జాలు కారణమని విమర్శించారు. ఈ కబ్జాలను నిరోధించడంలో ఈ ఎమ్మెల్యేలు విఫలమయ్యారని అన్నారు. దీంతో వరద నీరు సాఫీగా వెళ్ళకపోవడంతో ముంపునకు గురవుతున్నారని అన్నారు. ఇప్పుడు ఈ విమర్శలు వైరల్ గా మారాయి.
Warangal | ఎమ్మెల్యేల నిర్లక్ష్యంతో వరంగల్ ముంపు : ట్రాన్స్ జెండర్ పుష్పిత లయ
వరంగల్ ముంపుకు ఎమ్మెల్యేల నిర్లక్ష్యమే కారణమని ట్రాన్స్ జెండర్ పుష్పిత లయ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ చీర, గాజులు పంపిస్తామంటూ వ్యాఖ్యలు చేశారు.

Latest News
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం మృతి
ఈనెల 17 న హైదరాబాద్లో ఉపరాష్ట్రపతి పర్యటన
విద్యా, పర్యాటక, వైద్య రంగాల్లో కలిసి పనిచేద్దాం.. ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-vకు సీఎం విజ్ఞప్తి
ఐవీ కొనేది రూ.11కు.. రోగులకు అమ్మేది మాత్రం రూ.325కు
నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ దంపతుల తొలి పూజలు
ప్రకృతిని కాపాడుదాం.. చవితి ప్రత్యేకత ను చాటుదాం : జర్నలిస్ట్ గిరి ప్రసాద్ సోముల
పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది
ఘనంగా ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ*
పోతునూరు రైతుల “వరి” గోస