విధాత, వరంగల్ ప్రతినిధి:మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లక్ష్మ తండా కు చెందిన బాధిత బాలిక కుటుంబాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క సోమవారం పరామర్శించారు. కొద్దిరోజుల క్రితం బాలిక పై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన జరిగింది. ఈ రోజు బాధిత కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు.కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బాలిక కుటుంబానికి ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామి ఇచ్చారు. బాలిక మృతికి కారకులను కఠినంగా శిక్షిస్తామన్నారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు.
రాష్ట్రంలో గంజాయి,మత్తు మాఫియాలను ఉక్కు పాదంతో అణిచి వేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో అఘాయిత్యాలు జరగకుండా వాటి మూలాలపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపి బలరాం నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మత్తు మాఫియాను అణిచివేస్తాం.. బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన .. మంత్రి సీతక్క
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లక్ష్మ తండా కు చెందిన బాధిత బాలిక కుటుంబాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క సోమవారం పరామర్శించారు. కొద్దిరోజుల క్రితం బాలిక పై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన జరిగింది.

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు