విధాత, వరంగల్ ప్రతినిధి:మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లక్ష్మ తండా కు చెందిన బాధిత బాలిక కుటుంబాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క సోమవారం పరామర్శించారు. కొద్దిరోజుల క్రితం బాలిక పై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన జరిగింది. ఈ రోజు బాధిత కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు.కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బాలిక కుటుంబానికి ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామి ఇచ్చారు. బాలిక మృతికి కారకులను కఠినంగా శిక్షిస్తామన్నారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు.
రాష్ట్రంలో గంజాయి,మత్తు మాఫియాలను ఉక్కు పాదంతో అణిచి వేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో అఘాయిత్యాలు జరగకుండా వాటి మూలాలపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపి బలరాం నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మత్తు మాఫియాను అణిచివేస్తాం.. బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన .. మంత్రి సీతక్క
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లక్ష్మ తండా కు చెందిన బాధిత బాలిక కుటుంబాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క సోమవారం పరామర్శించారు. కొద్దిరోజుల క్రితం బాలిక పై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన జరిగింది.

Latest News
Credit Card Limit | మీ క్రెడిట్ కార్డు లిమిట్ను బ్యాంకులు అకస్మాత్తుగా తగ్గించేశాయా?
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత
బీజేపీకి అన్నామలై రాజీనామా..తమిళనాట మరో కొత్త పార్టీ
పర్యావరణ విధ్వంసం..గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు: రాహుల్ గాంధీ ట్వీట్
కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు