విధాత : ఫిరాయింపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేను కలవడంపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. రాహుల్ గాంధీ ఓ చేత్తో రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ సవరించి ఫిరాయింపు చేసే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామని పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారన్నారు. అదే రాహుల్ గాంధీ ఫిరాయింపు నిరోధక నిబంధనలకు వ్యతిరేకంగా అయిదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ అనర్హతపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించారన్నారు. ఇది రాజ్యాంగాన్ని రక్షించడమా లేదా అపహస్యం చేయడమా అని ప్రశ్నించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్తామనీ కేటీఆర్ తెలిపారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సుప్రీంకు వెళ్తాం : కేటీఆర్
ఫిరాయింపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.

Latest News
కిషన్ రెడ్డికి, సంజయ్ కి కాస్తంత కూడా సిగ్గు లేదు..బీజేపీకి మహిళా బిల్లు పాస్ కావాలని లేదు
శవంతో పాటు కోటిన్నర బెంజ్ కారును పూడ్చిపెట్టిన చైనా ఫ్యామిలీ.. వీడియో వైరల్!
20న సీఎం రేవంత్ మేడిగడ్డ సందర్శన..నస్తూరపల్లిలో బహిరంగసభ
అంగరంగ వైభవంగా భద్రకాళీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
పవన్ కళ్యాణ్ ఆరోగ్యం నిలకడగా ఉంది ...
ఆర్తి అగర్వాల్ మరణానికి అసలు కారణాలు ఏంటి...
నా కొత్త పార్టీలోకి భారీగా చేరికలు : కల్వకుంట్ల కవిత
ఇక ఏపీలో ‘ప్రాజెక్ట్ పునర్విక’: మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
కన్నడ నేలపై మళ్లీ శివాంగి(చిరుత)ల పునరాగమనం!
లెన్స్కార్ట్ క్షమాపణలు.. బొట్టు, హిజాబ్, తిలకాలకు గ్రీన్ సిగ్నల్!