విధాత : ఫిరాయింపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేను కలవడంపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. రాహుల్ గాంధీ ఓ చేత్తో రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ సవరించి ఫిరాయింపు చేసే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామని పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారన్నారు. అదే రాహుల్ గాంధీ ఫిరాయింపు నిరోధక నిబంధనలకు వ్యతిరేకంగా అయిదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ అనర్హతపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించారన్నారు. ఇది రాజ్యాంగాన్ని రక్షించడమా లేదా అపహస్యం చేయడమా అని ప్రశ్నించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్తామనీ కేటీఆర్ తెలిపారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సుప్రీంకు వెళ్తాం : కేటీఆర్
ఫిరాయింపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.

Latest News
‘ఎన్టీఆర్ గురించి విచిత్ర కామెంట్స్’..
100 ఏళ్ల తర్వాత బుధాదిత్య రాజయోగం..! ఈ నాలుగు రాశుల వారు కొత్త ఇల్లును కొనడం ఖాయం..!!
శనివారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి సోదరుల నుంచి ఊహించని ధన సహాయం..!
సంచలన కాంబినేషన్లతో మెగా158? ఐశ్వర్యారాయ్ తెలుగులోకి..!
18న మేడారంలో తెలంగాణ కేబినెట్.. రేవంత్ ఉద్దేశం ఇదేనా..?
విషాదం : నాటు బాంబు వల్ల ఏనుగు పిల్ల మృతి
ఫ్యాటీ లివర్ సమస్యకు చక్కటి పరిష్కారం ముల్లంగి.. దీని ప్రయోజనాలు తెలిస్తే తినక మానరు..!
అడవి ఏనుగుల ఉన్మాదం – ఇద్దరు రైతుల దారుణ మరణం
మీకు తెలుసా.. రైలు ఆలస్యమైతే ఫ్రీగా ఫుడ్ పొందొచ్చు..!
పుట్టగొడుగుల సాగుతో.. నెలకు రూ. 2 లక్షలు సంపాదిస్తున్న ఒడిశా రైతు