విధాత : పార్టీ మారాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తనపై ఒత్తిడి తెస్తుందని జనగామ ఎమ్మెల్యే బీఆరెస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అమెరికాలోని వర్జీనియాలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ మార్పు కోసం ప్రభుత్వం సాగిస్తున్న ఒత్తిళ్లు, వేధింపుల్లో భాగంగా తనపై ఆరు నెలల్లోనే నాలుగైదు కేసులు నమోదు చేశారన్నారు. నాతో పాటు నా భార్య నీలిమ, కొడుకు అనురాగ్ పైన కూడా కేసులు పెట్టారని తెలిపారు. అలాంటి వాటికి భయపడకుండా న్యాయపోరాటం చేస్తానన్నారు. ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చానని, కేసులు, అరెస్టులు నాకు కొత్త కాదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ నేతలు కక్షపూరిత రాజకీయాలను ప్రారంభించారని తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణాలో ఇలాంటి వాతావరణం చూడలేదని అన్నారు. బీఆరెస్లోకి రాక ముందు ఉద్యమంలో జేఏసీతో కలిసి పని చేశానని, నాడు ఉమ్మడి పాలకులు కేసులు పెట్టారని, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో విలువలు పాటించాలని, గెలిచిన పార్టీలోనే ప్రజాప్రతినిధులు ఐదేళ్లు ఉండాలన్నారు.
పార్టీ మారాలంటూ ఒత్తిడి చేస్తున్నారు , అక్రమ కేసులతో వేధిస్తున్నారు … జనగామ ఎమ్మెల్యే బీఆరెస్ నేత పల్లా
పార్టీ మారాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తనపై ఒత్తిడి తెస్తుందని జనగామ ఎమ్మెల్యే బీఆరెస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అమెరికాలోని వర్జీనియాలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా పాల్గొన్నారు

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు