విధాత : పార్టీ మారాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తనపై ఒత్తిడి తెస్తుందని జనగామ ఎమ్మెల్యే బీఆరెస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అమెరికాలోని వర్జీనియాలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ మార్పు కోసం ప్రభుత్వం సాగిస్తున్న ఒత్తిళ్లు, వేధింపుల్లో భాగంగా తనపై ఆరు నెలల్లోనే నాలుగైదు కేసులు నమోదు చేశారన్నారు. నాతో పాటు నా భార్య నీలిమ, కొడుకు అనురాగ్ పైన కూడా కేసులు పెట్టారని తెలిపారు. అలాంటి వాటికి భయపడకుండా న్యాయపోరాటం చేస్తానన్నారు. ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చానని, కేసులు, అరెస్టులు నాకు కొత్త కాదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ నేతలు కక్షపూరిత రాజకీయాలను ప్రారంభించారని తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణాలో ఇలాంటి వాతావరణం చూడలేదని అన్నారు. బీఆరెస్లోకి రాక ముందు ఉద్యమంలో జేఏసీతో కలిసి పని చేశానని, నాడు ఉమ్మడి పాలకులు కేసులు పెట్టారని, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో విలువలు పాటించాలని, గెలిచిన పార్టీలోనే ప్రజాప్రతినిధులు ఐదేళ్లు ఉండాలన్నారు.
పార్టీ మారాలంటూ ఒత్తిడి చేస్తున్నారు , అక్రమ కేసులతో వేధిస్తున్నారు … జనగామ ఎమ్మెల్యే బీఆరెస్ నేత పల్లా
పార్టీ మారాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తనపై ఒత్తిడి తెస్తుందని జనగామ ఎమ్మెల్యే బీఆరెస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అమెరికాలోని వర్జీనియాలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా పాల్గొన్నారు

Latest News
నేడు తెలంగాణలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు !
ఎన్ని తరాలు మారినా మొగుడు చెప్పిందే పెళ్లాం వినాల్సిందేనా.. జెన్ జెడ్లోనూ అవే పాతకాలపు ఆలోచనలు
పెరిగిన బంగారం..తగ్గిన వెండి
విడాకులకి అప్లై చేసిన తరుణ్ భాస్కర్ ..
Netflix Studios | హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ స్టూడియోస్.. ఈ నెల12న ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
మరో యువ హీరో పెళ్లికి సిద్ధమయ్యాడా..
సోమాజిగూడలో భారీ అగ్నిప్రమాదం.. వైన్ షాపు దగ్ధం
గృహిణులకు షాక్.. భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు.. హైదరాబాద్లో ధర ఎంతంటే..?
రెండున్నర ఎకరాల్లో 70 టన్నుల అరటి పండ్ల ఉత్పత్తి.. ఏడాదిలోపే రూ. 12 లక్షల ఆదాయం
ముగ్గు పోయని వారికి ఇందిరమ్మ ఇల్లు రద్దు.. జాబితా సిద్ధం చేస్తోన్న అధికారులు..!