విధాత: ఎయిడెడ్ కాలేజీల విషయంలో ప్రభుత్వ ప్రతిపాదనలకు సమ్మతించని యాజమాన్యాలకు యథావిధిగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఎయిడెడ్ పోస్టులు, విద్యాసంస్థల ఆస్తులు సరెండర్ చేయాలని ఎలాంటి ఒత్తిడీ చేయబోమని ఉన్నత విద్యాశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు హామీఇచ్చారు. వివరాలు నమోదు చేసిన న్యాయస్థానం ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను రెండువారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది. ఎయిడ్ కళాశాలల విలీనం విషయంలో అధికారులు ఒత్తిడిచేస్తే పోలీసులకు ఫిర్యా దు చేయాలని పిటిషనర్లకు సూచించింది.
ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఎలాంటి ఒత్తిడి చేయం
<p>విధాత: ఎయిడెడ్ కాలేజీల విషయంలో ప్రభుత్వ ప్రతిపాదనలకు సమ్మతించని యాజమాన్యాలకు యథావిధిగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఎయిడెడ్ పోస్టులు, విద్యాసంస్థల ఆస్తులు సరెండర్ చేయాలని ఎలాంటి ఒత్తిడీ చేయబోమని ఉన్నత విద్యాశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు హామీఇచ్చారు. వివరాలు నమోదు చేసిన న్యాయస్థానం ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను రెండువారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు […]</p>
Latest News

గరంగరంగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు
భద్రకాళి దేవాలయాన్ని సందర్శించిన పవన కల్యాణ్ సతీమణి
నేషనల్ మాస్టర్స్ గేమ్స్ 2026లో మూడు స్వర్ణాలు సాధించిన భద్రాచలం పెన్షనర్ గాలి రామ్మోహనరావు
ఏఐ ఎఫెక్ట్.. రానున్న రెండేళ్లలో లక్షల్లో ఉద్యోగులను తొలగించనున్న బడా టెక్ కంపెనీలు
తెలంగాణలో రైతు భరోసా సాయంపై కీలక అప్డేట్
మెగా ఫ్యామిలీలో కొత్త కాంబో..
గ్రామీ అవార్డ్స్ 2026 రెడ్ కార్పెట్పై బోల్డ్ ఫ్యాషన్ హంగామా..
పాకిస్తాన్ బహిష్కరించినా.. శ్రీలంకకు భారత్ వెళ్లాల్సిందే!
శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్
కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు