మనం కడుపు నింపుకునేందుకు ఉపయోగించే ఆహార పదార్థాల్లో బియ్యం ఒకటి. ఈ బియ్యం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. అయితే కొందరు ఒక నెలకు సరిపడా బియ్యం తెచ్చుకుంటారు. మరికొందరైతే ఏడాదికి సరిపడా బియ్యం బ్యాగులు తెచ్చేసుకుంటారు. ఇలాంటప్పుడు బియ్యంలో లక్క పురుగు లేదా నలుపు రంగులో ఉండే పురుగులు కనిపిస్తుంటాయి. ఈ పురుగులను బియ్యం నుంచి వేరు చేసేందుకు గ్రామాల్లో చేటల్లో వేసుకుని చెరుగుతారు. కానీ పట్టణాల్లో ఉండే వారు, ఉద్యోగాలతో బిజీగా గడిపేవారికి అంత సమయం ఉండదు. కాబట్టి ఈ పురుగులను బియ్యం నుంచి వేరు చేసేందుకు కొన్ని చిట్కాలు ఫాలో అయితే సరిపోతోంది. పురుగుల్లేని బియ్యంతో అన్నం వండుకొని హాయిగా భోజనం చేయొచ్చు. అప్పుడు మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. మరి ఆ చిట్కాలు ఏంటో చూసేద్దాం..
చిట్కాలు ఇవే..
- ప్రతి ఒక్కరూ బియ్యాన్ని సంచుల్లో నిల్వ చేస్తారు. ఆ సంచులను ఒక దానిపై ఒకటి వేసి ఉంచుతారు. దీంతో సహజంగానే బియ్యంలో లక్క పురుగు, నలుపు రంగులో ఉండే పురుగులు దర్శనమిస్తుంటాయి. ఈ పురుగుల నివారణకు వేపాకును ఆ సంచుల్లో వేస్తారు. దాంతో పురుగులు మాయమవుతాయి.
- బియ్యంలో పురుగులు చేరకుండా ఉండడానికి మరో అద్భుతమైన చిట్కా ఏంటంటే.. బియ్యంలో లవంగాలు, దాల్చిన చెక్క వేసినా కూడా పురుగులు కనిపించవు. చాలా మంది గృహిణులు ఈ చిట్కాను ఫాలో అవుతుంటారు. బియ్యం క్వాంటిటీని బట్టి ఒక నాలుగైదు లవంగాలు, దాల్చిన చెక్క వేస్తే సరిపోతోంది.
- రైస్లో కొన్ని ఎండు మిరపకాయలు పెట్టడంతో కూడా పురుగులు మాయమవుతాయి. ఈ ఎండుమిర్చి వాసనకు బియ్యానికి పురుగులు పట్టవు. అయితే రెండు వారాలకు ఒకసారి వాటిని మార్చాలి. ఇలా చేయడం ద్వారా మంచి రిజల్ట్ కనిపిస్తుంది.
- మనం వివిధ వంటకాల్లో స్పైసీ కోసం ఉపయోగించే మిరియాలు కూడా రైస్ ఎక్కువకాలం నిల్వ ఉంచడానికి ఉపయోగపడాతాయి. మీరు బియ్యం మీద కొన్ని మిరియాలు వేయడం ద్వారా కూడా పురుగు పట్టదు. ఆ వాసన అన్ని కీటకాలనూ పారిపోయేలా చేస్తుంది. ఒకవేళ మీ బియ్యానికి ఇప్పటికే పురుగు పట్టినట్లయితే.. ఆ వాసనకు అవి పారిపోతాయి.
- వెల్లుల్లి రెబ్బలు బియ్యం సంచుల లోపల పొట్టు తీయకుండా అలాగే ఉంచడం వల్ల అందులోకి పురుగులు రావు.