హైదరాబాద్, సెప్టెంబర్ 28(విధాత): చత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కాంకేర్, గరియాబంద్ జిల్లాల సరిహద్దులోని రావస్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం అందడతో డీఆర్జీ బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు జరిగినట్లు ఆ జిల్లా ఎస్పీ తెలిపారు. ఘటనా స్థలం వద్ద ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మృతి చెందిన వారిలో ఓ మహిళా, ఏరియా కమిటీ సభ్యలు కూడా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్తో కలిపి చత్తీస్గఢ్లో జరిగిన వేర్వేరు కాల్పుల్లో 252 మంది మావోలు హతమయ్యారని పేర్కొన్నారు.
కాంకేర్ జిల్లాలో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు హతం
చత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు

Latest News
విజయ్ విడాకుల వివాదంలో మళ్లీ ట్రెండ్ అవుతున్న త్రిష ..
ఇరాన్ సుప్రీమో ఆయతుల్లా అలీ ఖమేనీ ఎలా హతమయ్యాడు.?
యూరియా యాప్ పరేషాన్..ఒకసారి బుక్ చేస్తే నెలరోజుల వరకు నో ఛాన్స్!
ఆంధ్రప్రదేశ్ను తెలుగునాడుగా మార్చాలి: గరికిపాటి కీలక వ్యాఖ్యలు
పాక్ లో యూఎస్ఏ కాన్సులెట్ పై దాడి..కాల్పుల్లో 8మంది మృతి
స్వగ్రామానికి విరోష్ జంట…
ఒడిస్సా రాష్ట్ర కమిటీ సభ్యుడు వికాస్ సహా 15 మంది మావోయిస్టుల లొంగుబాటు
జ్యోతిష్యంతో చావు భయం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య !
నాగ్ పూర్ లో పేలుడు.. 15మంది దుర్మరణం
ఇరాన్ పాలన సుప్రీం లీడర్ నుంచి కౌన్సిల్ చేతిలోకి..!