హైదరాబాద్, సెప్టెంబర్ 28(విధాత): చత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కాంకేర్, గరియాబంద్ జిల్లాల సరిహద్దులోని రావస్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం అందడతో డీఆర్జీ బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు జరిగినట్లు ఆ జిల్లా ఎస్పీ తెలిపారు. ఘటనా స్థలం వద్ద ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మృతి చెందిన వారిలో ఓ మహిళా, ఏరియా కమిటీ సభ్యలు కూడా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్తో కలిపి చత్తీస్గఢ్లో జరిగిన వేర్వేరు కాల్పుల్లో 252 మంది మావోలు హతమయ్యారని పేర్కొన్నారు.
కాంకేర్ జిల్లాలో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు హతం
చత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు

Latest News
సమ్మర్లో మీ ఫ్రిజ్ కూలింగ్ తగ్గిందా.. ఈ టిప్స్తో సమస్యను చిటికెలో సాల్వ్ చేయండి!
చెప్పులు విప్పిన గుట్టు… భార్య రహస్యం రట్టు!
అదే క్లాసిక్ డిజైన్.. కానీ అధునాతన ఫీచర్లు.. మార్కెట్లోకి బజాజ్ పల్సర్ 180 రీఎంట్రీ!
ఎండలో ఉన్నా.. కింద పడ్డా సేఫ్గా ఉండే మొబైల్.. రూ.35వేలలోనే తీసుకొస్తున్న ఒప్పో
సూపర్స్టార్ కృష్ణ బర్త్డే రోజున 'వారణాసి' బిగ్ సర్ప్రైజ్?
ఇది మీ ఇండియా కాదు.. రోడ్డుపై గుట్కా ఉమ్మేసిన టూరిస్ట్ను కడిగిపారేసిన నేపాలీ.. వీడియో వైరల్
స్పెయిన్లో మంచి జాబ్.. ఫ్రీగా ఇల్లు.. బంపరాఫర్ పొందాలంటే ఆ ఒక్కటే కండీషన్!
రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు
స్వల్పంగా పెరిగిన బంగారం..స్థిరంగా వెండి !
కారుపై పడిన సిమెంట్ ట్యాంకర్..ఒకరి మృతి