Lakshmi devi Puja | హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తుంటారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించి, సిరిసంపదలు సమకూరేలా చూడాలని లక్ష్మీదేవిని భక్తులు వేడుకుంటారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు భక్తులు లక్ష్మీదేవికి పూజలు చేస్తూనే ఉంటారు. అయితే రాత్రి సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే ఎంతో మంచిదని పండితులు సూచిస్తున్నారు. శుక్రవారం రోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కనక వర్షం కురిపిస్తోందట.
లక్ష్మీదేవి పూజలో భాగంగా శుభ్రంగా ఉతికిన దుస్తులను ధరించాలి. అనంతరం ఎర్రని వస్త్రంపై అమ్మవారి ఫొటో లేదంటే విగ్రహాన్ని, దాంతోపాటు శ్రీ యంత్రాన్ని ఉంచాలి. ముందుగా నెయ్యితో దీపాన్ని వెలిగించిన అనంతరం అష్ట గంథాన్ని శ్రీ యంత్రం, లక్ష్మీ దేవికి తిలకంగా పెట్టాలి. ఆ తర్వాత అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సమర్పించాలి.
అయితే మొత్తం 12 రాశుల్లో నాలుగు రాశులను అదృష్టవంతులుగా పరిగణిస్తారు. ఈ నాలుగు రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. సిరిసంపదలు, ఐశ్వర్యం ఎల్లప్పుడూ వీరితోనే ఉంటాయి. ఈ నాలుగు రాశుల వారు శుక్రవారం రాత్రి లక్ష్మీదేవిని పూజిస్తే ఆ ఇంట సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పండితులు చెబుతున్నారు.
మీనరాశి : తమతోపాటు ఇతరులను కూడా వీరు అదృష్టవంతులుగా భావిస్తారు. వీరు ఎక్కడ ఉంటే అక్కడే సంపద, ఆనందం ఉంటాయి. కెరీర్లో ఉన్నతస్థాయికి చేరుకుంటారు.
ధనస్సు : ధనస్సు రాశికి గురువు అధిపతి. ఈ గ్రహం ప్రభావం వల్ల సంపదను పొందుతాడు. ధనస్సు రాశివారు అదృష్టవంతులుగా పరిగణించబడతారు. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఈ రాశి అమ్మాయిలకు లక్ష్మీదేవి విశేషమైన కృప లభిస్తుంది.
కర్కాటక రాశి : అమ్మాయిల అదృష్టం బలంగా ఉంటుంది. వీరివల్ల కుటుంబం ఆనందంగా ఉంటుంది. ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. జీవితంలో దేనికీ లోటు ఉండదు.
వృషభ రాశి : ఈ రాశివారు కష్టజీవులు.. అదృష్టవంతులు. తెలివైనవారు. శ్రమతో విజయం సాధిస్తారు. కుటుంబంలో వీరికి ప్రత్యేకంగా గౌరవం లభిస్తుంది.