హైదరాబాద్లోని గోల్కొండ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ హాస్టల్ వాష్రూమ్లో యువతి ప్రసవించిన ఘటన కలకలం రేపింది. ఆ యువతి ప్రసవం అనంతరం వాష్రూమ్ వెంటిలేటర్ నుంచి ఆ శిశువును బయటకు విసిరేయడంతో నవజాత శిశువు మృతి చెందింది. తీవ్ర రక్తస్రావమైన యువతి ప్రస్తుతం నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని సమాచారం.
నవజాత శిశువు మృతదేహాన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. యువతి గర్భం విషయం తమకు తెలియదని హాస్టల్ సిబ్బంది చెబుతున్నారు. పోలీసులు ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. యువతి తన బావ కారణంగా గర్భం దాల్చి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
