విధాత : ఓ వార్తా పత్రికలో వచ్చిన యాడ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ యాడ్ను చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అది అలాంటి యాడ్. నా డెత్ సర్టిఫికెట్ పొగొట్టుకున్నాను అని ఓ వ్యక్తి పేపర్కు యాడ్ ఇచ్చి.. అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ప్రకటనను ఐపీఎస్ ఆఫీసర్ రూపిన్ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ఇలాంటి ఘటనలు ఇండియాలోనే జరుగుతాయని క్యాప్షన్ ఇచ్చారు.
అసోం హోజాయి జిల్లాలోని లుండింగ్ బజార్కు చెందిన రంజిత్ కుమార్.. నా డెత్ సర్టిఫికెట్ పొగొట్టుకున్నాను అని పేపర్లో ప్రకటన ఇచ్చాడు. సెప్టెంబర్ 7వ తేదీన ఉదయం 10 గంటల సమయంలో సర్టిఫికెట్ మిస్ అయిందని పేర్కొన్నాడు. యాడ్లో డెత్ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ నంబర్, సీరియల్ నంబర్ను కూడా పేర్కొన్నాడు.
ప్రస్తుతం ఈ యాడ్పై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఒక వేళ సర్టిఫికెట్ దొరికితే స్వర్గంలో ఇవ్వాలా? నరకంలో ఇవ్వాలా? అని ఓ నెటిజన్ సరదాగా ప్రశ్నించాడు. ఓ వ్యక్తి తన డెత్ సర్టిఫికెట్ను పొగొట్టుకున్నాడు. ఎవరికైనా దొరికితే త్వరగా ఇవ్వండి.. లేదంటే ఆ దెయ్యానికి కోపం రావొచ్చు అని మరో నెటిజన్ చమత్కరించాడు. డెత్ సర్టిఫికెట్ పోయిందని తనకు తానే యాడ్ ఇవ్వడం ఇదే మొదటిసారి అయి ఉండొచ్చని ఇంకో నెటిజన్ పేర్కొన్నాడు.
Latest News
మే 1 నుంచి తెలంగాణ ప్రభుత్వోద్యోగుల బదిలీలు
వన్ప్లస్ నార్డ్ CE 6 లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయంటే..!
ఇంకో 6 రోజుల్లో 'పెద్ది' షూటింగ్ పూర్తి : జూన్లో విడుదల
మూడేళ్ల అనుభవంతో రూ.9కోట్ల ప్యాకేజీ.. రిమోట్ జాబ్ ఆఫర్పై యువతి పోస్టు వైరల్
పాములతో ఫ్యామిలీ బిజినెస్.. కోట్లు సంపాదిస్తున్న చైనా యువతి!
రైతు భరోసాపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం.. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం
హాష్ అయిల్ అంతర్ రాష్ట్ర స్మగ్లింగ్ ముఠా అరెస్టు.. రెండున్నర కోట్ల విలువైన ఆయిల్ స్వాధీనం
కేసీఆర్ తెలంగాణ ‘సెంటిమంట’ పండేనా! ఆ మూడు అంశాలపై మౌనమెందుకు?
సాఫ్ట్వేర్ జాబ్ పోవడంతో.. ఇంటిపై గంజాయి సాగు చేస్తున్న హైదరాబాద్ టెక్కీ
కుసుమంచిలో సర్వే మ్యాప్తో తొలి రిజిస్ట్రేషన్.. భూ రిజిస్ట్రేషన్లలో నూతన శకం