విధాత : ఓ వార్తా పత్రికలో వచ్చిన యాడ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ యాడ్ను చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అది అలాంటి యాడ్. నా డెత్ సర్టిఫికెట్ పొగొట్టుకున్నాను అని ఓ వ్యక్తి పేపర్కు యాడ్ ఇచ్చి.. అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ప్రకటనను ఐపీఎస్ ఆఫీసర్ రూపిన్ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ఇలాంటి ఘటనలు ఇండియాలోనే జరుగుతాయని క్యాప్షన్ ఇచ్చారు.
అసోం హోజాయి జిల్లాలోని లుండింగ్ బజార్కు చెందిన రంజిత్ కుమార్.. నా డెత్ సర్టిఫికెట్ పొగొట్టుకున్నాను అని పేపర్లో ప్రకటన ఇచ్చాడు. సెప్టెంబర్ 7వ తేదీన ఉదయం 10 గంటల సమయంలో సర్టిఫికెట్ మిస్ అయిందని పేర్కొన్నాడు. యాడ్లో డెత్ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ నంబర్, సీరియల్ నంబర్ను కూడా పేర్కొన్నాడు.
ప్రస్తుతం ఈ యాడ్పై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఒక వేళ సర్టిఫికెట్ దొరికితే స్వర్గంలో ఇవ్వాలా? నరకంలో ఇవ్వాలా? అని ఓ నెటిజన్ సరదాగా ప్రశ్నించాడు. ఓ వ్యక్తి తన డెత్ సర్టిఫికెట్ను పొగొట్టుకున్నాడు. ఎవరికైనా దొరికితే త్వరగా ఇవ్వండి.. లేదంటే ఆ దెయ్యానికి కోపం రావొచ్చు అని మరో నెటిజన్ చమత్కరించాడు. డెత్ సర్టిఫికెట్ పోయిందని తనకు తానే యాడ్ ఇవ్వడం ఇదే మొదటిసారి అయి ఉండొచ్చని ఇంకో నెటిజన్ పేర్కొన్నాడు.
Latest News
ఆంధ్రప్రదేశ్ పేరు మార్పుపై రేగిన రచ్చ !
ఇరాన్ అనుకూల ర్యాలీలు చేసే వారిని అక్కడికే పంపించాలి : రాజాసింగ్
కాళేశ్వరం బ్యారేజీలను నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ : కేటీఆర్ ఫైర్
యుద్దానికి మనం సిద్దం కావాలి : రాహుల్ గాంధీ
విజయ్ విడాకుల వార్తల మధ్య TVK లో త్రిష పేరు..
కుప్పకూలిన బంగారం, వెండి ధరలు
బాబాయ్ డేట్స్ ఇస్తే నా సినిమాకి తీసుకుంటా..
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటీటీ స్ట్రీమింగ్పై ఆసక్తికర అప్డేట్ ..
వన్ మ్యాన్ షో : భారత్ను సెమీఫైనల్కు చేర్చిన సంజూశాంసన్
పొట్టి డ్రెస్లో మతిపోగొడుతున్న శ్రీలీల న్యూ లుక్