Chamala Kiran Kumar | రేవంత్ ప్రశ్నించాకే.. 24గంటల ఉచిత కరెంటు: చామల

Chamala Kiran Kumar విధాతః పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించాకే రైతులకు 24గంటల ఉచిత విద్యుత్తు సరఫరా జరుగుతుందని పీసీసీ అధికార ప్రతినిధి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. వ్యవసాయం గురించి తనకు మాత్రమే తెలిసినట్లు కేటీఆర్ మాట్లాడుతున్నారని, కేసీఆర్ పార్టీ పెట్టిన రోజు కేటీఆర్ అమెరికాలో వున్నారని, హరీష్ రావు ఎమ్మెల్యే కాకముందే ఆయనకు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చిందన్నారు. కేసీఆర్ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. […]

  • Publish Date - July 17, 2023 / 10:28 AM IST

Chamala Kiran Kumar

విధాతః పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించాకే రైతులకు 24గంటల ఉచిత విద్యుత్తు సరఫరా జరుగుతుందని పీసీసీ అధికార ప్రతినిధి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. వ్యవసాయం గురించి తనకు మాత్రమే తెలిసినట్లు కేటీఆర్ మాట్లాడుతున్నారని, కేసీఆర్ పార్టీ పెట్టిన రోజు కేటీఆర్ అమెరికాలో వున్నారని, హరీష్ రావు ఎమ్మెల్యే కాకముందే ఆయనకు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చిందన్నారు. కేసీఆర్ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ అన్నారు.

రేవంత్ ను టీడీపీకి అంటగట్టి బీఆరెస్ రాజకీయ దుష్ప్రచారం చేస్తుందని, నిజానికి టీడీపీ నుండి వచ్చిన వారంతా ఈ రోజు కేసీఆర్ సహా బీఆరెస్ మంత్రివర్గంలో ఉన్నారన్నారు. బషీర్ బాగ్ కాల్పులు జరిగినప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీలో లేరని, కేసీఆర్ అప్పుడు టీడీపీలోనే ఉన్నారని గుర్తు చేశారు. రైతు వేదికల చర్చలో గ్రామ స్థాయి కాంగ్రెస్ నాయకులు పాల్గొని అధికార పార్టీ నాయకులను ప్రశ్నించాలని తమ పార్టీ పిలుపునిస్తుందన్నారు.

రైతు వేదికలను బీఆరెస్ తమ ప్రచారానికి వాడుకుంటుందని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడం కోసమే ఢిల్లీలో బీజేపీ నేతలను కేటీఆర్ కలిశారని, లిక్కర్ స్కామ్ లో మనీష్ సిసోడియాను అరెస్టు చేసినప్పుడు ఎమ్మెల్సీ కవితను ఎందుకు అరెస్టు చేయలేదని, ఈ నేపధ్యంలోనే బీజేపీ, బీఆరెస్ లు కుమ్మక్కయ్యారని ప్రజలు భావిస్తున్నారన్నారు

Latest News