Vinay Bhaskar | సంక్షేమ పథకాలకు.. BRS పెద్ద పీట: చీఫ్ విప్ దాస్యం

Vinay Bhaskar | 300 కుటుంబాలకు రు.3 కోట్లతో బీ.సీ బంధు తెలంగాణలో బిసి బంధు గొప్ప పథకం రాష్ట్రంలో 14 బీసీ కులాలు ఆర్థికంగా అభివృద్ధి చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పథకాలతో బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కొనియాడారు. హనుమకొండ అంబేద్కర్ భవన్‌లో శనివారం నిర్వహించిన […]

  • Publish Date - August 12, 2023 / 12:00 AM IST

Vinay Bhaskar |

  • 300 కుటుంబాలకు రు.3 కోట్లతో బీ.సీ బంధు
  • తెలంగాణలో బిసి బంధు గొప్ప పథకం
  • రాష్ట్రంలో 14 బీసీ కులాలు ఆర్థికంగా అభివృద్ధి
  • చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పథకాలతో బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కొనియాడారు. హనుమకొండ అంబేద్కర్ భవన్‌లో శనివారం నిర్వహించిన బీసీ కుల వృత్తుల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చీఫ్ విప్ మాటల్లో కుల వృత్తులను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం తెచ్చిన పథకాలతో నేడు ప్రతి పల్లె స్వయం సమృద్ధి సాధించి పల్లెలే ప్రగతికి పట్టుకొమ్మలనే నానుడిని నిజం చేస్తున్నాయి. ఇదే క్రమంలో వెనుకబడిన కుల వృత్తులను బలోపేతం చేసేందుకు బీసీ బంధు పథకం మరింత ఉపయోగపడుతుంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ బంధు పథకం ద్వారా లక్ష రూపాయల గ్రాంట్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయడం ఎంతో సంతృప్తినిచ్చింది.

ఆర్థికాభివృద్ధికి దోహదం

వృత్తిని నమ్ముకుని ఆధారపడ్డ కులాలకు ఆర్థిక సాయం అందించి వారిని ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యమని వినయ్‌ అన్నారు. గతంలో కూడా ఆర్థిక సాయం ఇచ్చేవారు కాకపోతే అది అప్పుగా ఇచ్చేవారు. దానికి బ్యాంకుల చుట్టూ తిరిగి ష్యూరిటీ పెట్టి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది.

ఇప్పుడు ఎలాంటి ష్యూరిటీ లేకుండానే ఉచితంగా లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నారు. బీసీ కులాల్లో అన్ని కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నారు. ముదిరాజు, బెస్త, గీత కార్మికులు, నాయి బ్రాహ్మణులు, గౌడ్, యాదవ సోదరులు ఇలా అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందించారు.

గీత, చేనేత, మత్స్య కార్మికులకు ప్రమాద బీమా, వృత్తినే జీవనాధారంగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న ఆయా వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రమాద బీమా కల్పిస్తున్నది. తెలంగాణకు పూర్వం కేవలం 19 బీసీ గురుకులాలు, 7580 విద్యార్థులు ఉంటే, నేడు 310 బీసీ గురుకులాల్లో 2022-23లో 33స్కూళ్లను,15 డిగ్రీకాలేజీలు నూతనంగా ఏర్పాటు చేసి, పాతవాట్లో 119 జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేసాం అన్నింట్లో కలిపి 1,81,880 విద్యార్ధులు ఉన్నారు. గత పాలకులకు రాని ఆలోచన, గత పాలకులు చేయని సంక్షేమం మన ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారు.

వృత్తిదారులకు ఫ్రీ కరెంటు

బీసీ కుల వృత్తిదారులకు చేయూత అందించాలనే ఉద్దేశంతో నాయి బ్రాహ్మణులు, రజకులకు ఫ్రీ కరెంటు, గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టామని వినయ్‌ అన్నారు. నేతన్నలకు 50 శాతం సబ్సిడీతో నూలు, వారు నేసిన వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేసే చేనేత మిత్ర కార్యక్రమం చేపట్టాం. మత్స్యకారుల కోసం నీటి వనరులలో ఉచిత చేప పిల్లలు పంపిణీ.

600 కోట్ల రూపాయలు వ్యయం చేసి మత్స్యకారులకు లూనాలు, మోపెడ్ల పంపిణీ చేశామన్నారు. గీత కార్మికులకు చెట్లు పన్ను మరియు పాత బకాయిల రద్దు, సొసైటీల పునరుద్ధరణ చేశాం. ప్రతి ఒక్క మండలంలో ఒక బీసీ, ఒక ఎస్సీ మరియు ప్రతి నియోజకవర్గానికి ఒక మైనారిటీ రెసిడెన్షియల్ విద్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాము.

ఈ కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్ ,అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ, ఆర్డీఓ రమేష్, GWMC డిప్యూటీ కమిషనర్ రవీందర్, బీసీ వెల్ఫేర్ డిడి రాంరెడ్డి, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు , రైతు సమితి కోఆర్డినేటర్లు, వెనుకబడిన తరగతుల శాఖ అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Latest News