బంగారం ధరలు సామాన్యులకు స్వల్ప ఊరట నిచ్చాయి. బులియన్ మార్కెట్లో గురువారం ధర దిగివచ్చింది. 22 క్యారెట్లపై బంగారంపై రూ.300 తగ్గి తులానికి రూ.64,650కి పతనమైంది
Gold Rates | బంగారం ధరలు సామాన్యులకు స్వల్ప ఊరట నిచ్చాయి. బులియన్ మార్కెట్లో గురువారం ధర దిగివచ్చింది. 22 క్యారెట్లపై బంగారంపై రూ.300 తగ్గి తులానికి రూ.64,650కి పతనమైంది. 24 క్యారెట్ల పసిడిపై రూ.330 దిగివచ్చి రూ.73,800కి ఎగిసింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.68,350 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.74,650కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.67,650 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.73,800కి తగ్గింది. ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.67,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,950కి దిగివచ్చింది.
ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.67,010 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,800 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు మరో వైపు వెండి ధర సైతం పైకి కదిలింది. మరో వైపు వెండి ధర నిలకడగా కొనసాగుతున్నది. హైదరాబాద్లో వెండి కిలో రూ.90వేలు పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈక్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి